5 తులాల బంగారు, 31 తులాల వెండి నగలు,
రూ.70వేల నగదు, 9 బైకులు స్వాధీనం
నిందితులపై పీడీయాక్టు నమోదు ప్రణాళిక
వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్చంద్రపవార్
మహబూబాబాద్, మే 30 : అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన చోరీ వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. గార్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన చింత అశోక్, చింత యుగంధర్ చోరీలకు పాల్పడి, సొత్తును తమ స్నేహితుడు సయ్యద్ కరీముల్లాకు అమ్మి, వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. కాగా, వీరు 2020లో పలు చోరీలకు పాల్పడగా మహబూబాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెండు సంవత్సరాల జైలు జీవితం గడిపి, 2022 మార్చిలో విడుదలయ్యారు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు.
మళ్లీ మూడు నెలల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 14 చోరీల్లో నిందితులుగా వీరు బైక్లు, దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడేవారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీరిపై 30 కేసులు, మహబూబాబాద్ జిల్లాలో 8 కేసులు ఉన్నాయి. కాగా, సోమవారం వీరు కురవి మండలం నల్లెల్ల క్రాస్ రోడ్డు నుంచి బైక్పై అనుమానాస్పదంగా వెళ్తుండగా సీసీఎస్ పోలీసులు ప ట్టుకున్నారు. 5 తులాల బంగారు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగదు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తనలో మా ర్పు రాకపోవడంతో చింత అశోక్, యుగంధర్, కరీముల్లాపై పీడీయాక్టు నమోదు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని ఎస్పీ వివరించారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీసీఎస్ సీఐ మోహన్, ఎస్సై శివ, సీరోల్ ఎస్సై నరేశ్, సీసీఎస్ ఏఎస్సైలు రహెమత్అలీ, ఉప్పలయ్య, ఉమాహేశ్వర్, రాజశేఖర్, రాజేశ్, నరేశ్, సీరోల్ సిబ్బంది రవీందర్, రాము, ఐటీకోర్ పీసీ నాగరాజు, గైడ్ చేసిన అడిషనల్ ఎస్సై(క్రైం)యోగేశ్గౌతమ్ను ఎస్పీ అభినందించారు.