మహబూబాబాద్ రూరల్, మే 2: బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపు కోసం ఓ వ్యక్తి వినూత్నంగా బైక్పై యాత్ర చేస్తున్నాడు. భద్రాచలం ప్రాంతం వేలేరు గ్రామానికి చెందిన తూతిక ప్రకాశ్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు.
భద్రాచలం నుంచి మానుకోట వరకు 140 కిలోమీటర్ల యాత్రను చేపట్టాడు. కాంగ్రెస్ హామీలు, పేదలకు చేస్తున్న అన్యాయం గురించి ఇంటింటికీ వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. కాంగ్రెస్, బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదని, పేదలకు బీఆర్ఎస్, కేసీఆర్ తోనే లబ్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్నాడు.
కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలకు ఎం తో ఆదరణ ఉంది. ఆయనే మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. అయినా వదలకుండా ప్రచారం చేస్తున్నా.