ఖిలావరంగల్, ఆగస్టు 14 : చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఖుష్మహల్ ప్రాంగణంలో పోలీసుల కవాతు నిర్వహించేందుకు ట్రాక్ సిద్ధం చేశారు. ఎర్రకోట మాదిరిగా భారీ సెట్టింగులు వేశారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం వేర్వేరుగా గ్యాలరీలు, బారికేడ్లు, శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలో తొలిసారి కోటలోని ఖుష్మహల్ ప్రాంగణంలో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల షెడ్యూల్ను కలెక్టర్ బీ గోపి ప్రకటించారు. ఉదయం 10.26 గంటలకు ముఖ్య అతిథి, ప్రభుత్వ సలహాదా రు జీఆర్ రెడ్డి ఖుష్మహల్ ప్రాంగణానికి చేరుకుంటారు. 10.30 గం టలకు జెండా ఆవిష్కరణ, 10.35 నుంచి 10.40 వరకుకు పరేడ్ పరిశీలన, 10.40 నుంచి 10.45 వరకు పరేడ్, 10.45 నుంచి 11 గం టల వరకు జిల్లా అభివృద్ధిపై ప్రసంగం, 11 నుంచి 11.20 వరకు సాం స్కృతిక కార్యక్రమాలు, 11.20 నుంచి 11.40 వరకు శకటాల ప్రదర్శన, 11.40 నుంచి 11.50 వరకు స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, 11.50 నుంచి 12.10 వరకు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ, 12.10 నుంచి స్టాళ్ల సందర్శన ఉంటుందన్నారు.