సుబేదారి, నవంబర్ 29: హ్యూమన్రైట్స్ ముసుగులో బెదిరింపులు, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడుతున్న మహిళ, విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీని వాస్జీ వివరాలు వెల్లడించారు. ఈనెల 26వ తేదీన పెద్దమ్మగడ్డకు చెందిన బీమా బీమయ్య అనుమానాస్పదంగా చనిపోగా, బంధువులు ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీకి పం పించే క్రమంలో జన్ను రాజు అనే వ్యక్తి మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన విలేకరిగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ తాటికాల క్రాంతికుమార్తో ఎస్సై రాజుకు ఫోన్లో మాట్లాడించగా అతడు అసభ్యక రం గా మాట్లాడి బెదిరించాడు.
ఎస్సై ఫిర్యాదు మేరకు విచారణ చేయగా క్రాంతి కుమార్పై హైదరాబాద్లోని పలు పోలీసు స్టేషన్లలో అనేక కేసులున్నాయని తేలింది. అదేవిధంగా రంగశాయిపేటకు చెందిన బుంగ జ్యోతీరమణ హ్యూమ న్ రైట్స్ రాష్ట్ర గవర్నర్ పేరుతో అడ్వకేట్లు రవి, సంజయ్తో కలిసి ముఠాగా ఏర్పడి పలు హోదాలు చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఫోన్లు చేసి బెది రించారు. సెటిల్మెంట్లు చేశారు. ఈ విషయాల్లో అడ్వకేట్లపై పలు కేసులు న మోదయ్యాయి. మంగళవారం క్రాంతికుమార్, బుంగజ్యోతిని అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పల్సర్ బైక్, హ్యూమన్ రైట్ లెటర్ ప్యాడ్స్, మెంబర్షిప్ సర్టిఫికెట్స్, సెటిల్మెంట్ భూ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.