రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రయాణ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు పయనమైన ఆడబిడ్డలు, చిన్నారులతో ఆర్టీసీ బస్స్టేషన్లు సందడిగా మారాయి. ముఖ్యంగా హనుమకొండ, వరంగల్ సహా ఎక్కడ చూసినా బస్సులన్నీ ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. అలాగే ఉదయం నుంచే ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వాహనాలతో ప్రధాన మార్గాలు బిజీబీజీగా ఉన్నాయి. ఈమేరకు జనం రద్దీ దృష్ట్యా ఆర్టీసీ పలు రూట్లలో అదనపు బస్సులు నడిపింది. ఇటు పోలీసు శాఖ సైతం బస్స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసింది – నమస్తే నెట్వర్క్