ఒక్కో పువ్వును పలకరిస్తూ.. నెలలతరబడి కష్టపడుతూ తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. చెట్ల కొమ్మలకో.. కొండ అంచులకో.. అప్పుడప్పుడూ ఇండ్ల పోర్టికోలకో తుట్టెలను కట్టి.. అందులో తేనెను పోగుచేస్తాయి. కొన్నాళ్లపాటు సరిపడా కావాల్సిన ఆహారాన్ని దాచుకుంటాయి. ఇంతా చేసి సంపాదించిన దాన్ని ఇదిగో ఇలా పొట్టకూటికి పాటుపడేవారి పాలుజేస్తాయి.
ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండి మధురమైన రుచిని కలిగిన తేనెపై ప్రజల్లో ఉండే ప్రీతి అంతా ఇంతా కాదు. ఈ అవసరాన్నే కొందరు ఆసరాగా చేసుకొని తేనెను అతికష్టంమీద సేకరించి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. రాజస్థాన్కు చెందిన పలువురు వ్యక్తులు హనుమకొండ బాలసముద్రంలో ఓ ఇంటి చూరుకు ఉన్న తుట్టెకు మంటపెట్టి తేనెటీగలను వెళ్లగొట్టి తేనె సేకరిస్తుండడం ‘నమస్తే’ కంటపడగా వారి కష్టాన్ని ఇలా మీ ముందుకు తెచ్చింది.