కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశానికి చేసిందేమీ లేదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అన్ని రంగాల్లో గుజరాత్ను అభివృద్ధి చేశామని ఆ పార్టీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దీక్షా దివస్లో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి ముస్లిం మైనార్టీల సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోంమంత్రి హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
– నయీంనగర్, డిసెంబర్ 3
నయీంనగర్, డిసెంబర్ 3 : బీజేపీ దేశానికి చేసిందేమీ లేదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గుజరాత్ను అభివృద్ధి చేశామని ఆ పార్టీ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దీక్షా దివస్లో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జక్రియ ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి ముస్లిం మైనార్టీల సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇక్కడి సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు నిదర్శనం తెలంగాణ అభివృద్ధేనని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం షాదీముబారక్, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని వివరించారు. సంక్షేమ పథకాలతో ముస్లింలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఆనాడూ తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సీఎం కేసీఆర్ దీక్ష చేపట్టిప్పుడు 10 రోజుల తర్వాత.. మీరు దీక్ష ఆపాలి అని వైద్యులు సూచిస్తే సీఎం కేసీఆర్ ఒక్కటే మాట అన్నారు, తన ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ ప్రత్యేక రాష్ట్రం వస్తేనే ప్రజలు బాగుంటారని, ప్రత్యేక రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల అండ ఎల్లప్పుడూ ఉంటుందని, రాష్ట్రం అభివృద్ధి చెందిందని వారికి తెలుసని వివరించారు. ఉద్యమ సమయంలో దాస్యం వినయ్భాస్కర్ ఎంతో సాయం చేశారని గుర్తుచేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సదస్సులో కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, తెలంగాణ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ సాహెబ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.