రంగుల సంబురం అంబరాన్నంటింది. హోలీ పండుగ సందర్భంగా ఆటపాటలతో ఉమ్మడి జిల్లా అంతటా వేడుకలతో హోరెత్తింది. సోమవారం చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ వీధుల్లోకి వచ్చి రంగులు పులుముకోవడంతో ఊరూవాడా వర్ణశోభితమైంది. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ, నిట్ సహా పలు విద్యాసంస్థల్లో సంబురాలు జోరుగా సాగాయి. విద్యార్థులు కేరింతలు కొడుతూ రంగుల్లో మునిగితేలారు. ఇలా అన్ని జిల్లాల్లో ఉత్సాహంగా హోలీని జరుపుకొన్నారు. యువత ఉత్సాహంతో స్టెప్పులేస్తూ సంబురాల్లో మునిగితేలింది.