భూపాలపల్లి టౌన్, జూన్ 23: నిరుపేదల హక్కుల పరిరక్షణకే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను ఏర్పా టు చేసినట్లు భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నారాయణబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో నల్సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆఫీస్ ఆప్ ది లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంను హైకోర్టు ఛీప్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం గదిని జిల్లా జడ్జి ప్రారంభించి, కౌన్సిల్ చీఫ్ మేరుగు రవీందర్కు నియామక పత్రం అందజేసి తన స్థానంలో కూర్చోబెట్టా రు. అలాగే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ ఛీప్ అక్షయ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ దార పాటి ప్రియాంకలకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి విధులను గుర్తు చేసి అర్హులైన పేదలకు సత్వర న్యాయం అందాలని సూచించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ధనబలం, అండ బలం, కండ బలం న్యాయ వ్యవస్థ ముందు పనికి రాదని అన్నారు. న్యాయం కోసం న్యాయవాదులను నియమించుకునే స్థోమత లేని నిరుపేదలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అండగా ఉంటుందని అన్నారు. న్యాయవాదులు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా పనిచేయాలని కోరారు. ఏళ్ల తరబడి జైళ్లలో శిక్ష అనుభవిస్తూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేని నిరుపేద ఖైదీలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ తోడ్పాటునందిస్తుందని అన్నారు. జిల్లా కోర్టులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఛీఫ్గా నియమించడంపై మేరుగు రవీందర్ హైకోర్టు ఛీప్ జస్టిస్కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని, అర్హు లైన నిరుపేదలకు ఉచితంగా న్యాయం అందేలా చూస్తాన ని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీని యర్ సివిల్ జడ్జి కే జయరాంరెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రామచంద్రారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎదులాపురం శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శివరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ములుగులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్..
ములుగురూరల్, జూన్23: ములుగు జిల్లా కోర్టులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీపీ లలితా శివజ్యోతి లాంఛనంగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి ముందుగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మాధవి, ములుగు అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డీ రామ్మోహన్రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి జే సౌఖ్య, ము లుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ వేణుగోపాలాచారి, ప్రధాన కార్యదర్శి మేకల మహేందర్, న్యాయ వ్యాదులు నర్సిరెడ్డి, వినయ్కుమార్, భిక్షపతి, చంద్రయ్య, సునీల్కుమార్, స్వామిదాస్, రవీందర్, విజయ్, ప్రతాప్, రాజేందర్, రాంసింగ్, కుమార్, మానస, నవత, రజిత, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవీందర్, కోర్టు సిబ్బంది తదితలు పాల్గొన్నారు.