కాజీపేట, సెప్టెంబర్ 24 : తెలంగాణలో ఒక వైపు అభివృద్ధి, మరో వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దర్గా కాజీపేట 48వ డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పద్మశాలి భవనంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చీఫ్ విప్కు మహిళలు తిలకం దిద్ది, నృత్యాలు చేస్తూ, డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్విప్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేశానన్నారు. 48వ డివిజన్లో ఇప్పటికే దాదాపు రూ.20 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించినట్లు తెలిపా రు. ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్నా నియోజక వర్గానికి రూ.ఐదు కోట్ల అభివృద్ధి పనులను కూడా చేపట్టలేక పోయానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నియోజక వర్గం అన్ని విధాల అభివృద్ధితో పాటు, వేల సంఖ్యలో ప్రభు త్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించామన్నారు.
నగరాన్ని ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దామన్నారు. త్వరలో ఐటీ హబ్గా మారబోతుందన్నారు. ఇప్పటికే నగరంలో దాదాపు 3780 మంది స్థానికులు ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఐటీ విద్యను అభ్యసించిన పిల్లలు ఇక నుంచి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లనవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తుండడంతో అన్ని పార్టీల నాయకులు మీ ముందుకు వస్తున్నారని, కరో నా సమయం, కష్టకాలంలో వారు ఎక్కడికి పోయారని వారిని ప్రశ్నించాలన్నారు. కరోనా సమయంలో తాను 46 వేల కుటుంబాలకు అండగా నిలబడినట్లు తెలిపారు. సంఘాలన్నీ సంఘటితంగా ఉండాలన్నారు. భవిష్యత్లో నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉండి, కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో తనను పశ్చిమ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆశీర్వదించి పంపారని, ప్రజలందరూ భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, శ్రీకాంతాచారి, హరిశంకర్, రోహిత్ సింగ్ ఠాకూర్, రమేశ్, ఖాజాబాయ్ పాల్గొన్నారు.