హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో హోలీ వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకోగా ఊరూవాడా వర్ణశోభితమైంది. ముఖ్యంగా యువతీయువకులు సంబురాల్లో మునిగారు. దోస్తులతో కలిసి బైక్లపై తిరుగుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. కూడళ్ల వద్ద నృత్యాలతో హోరెత్తించారు.
నమస్తే, నెట్వర్క్: హనుమకొండ జిల్లాలో తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఉ మ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ జగన్మోహన్రావు ఆధ్వర్యంలో సభ్యులు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, టీజీవో వరంగల్ జిల్లా కార్యదర్శి ఫణికుమార్ పాల్గొన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లాను కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి బీ సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పీ వేణుగోపాల్, కేంద్ర సంఘ నాయకులు శ్యాంసుందర్, రామునాయ క్, లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. అలాగే న్యూశాయంపేట 31వ డివిజన్లో కార్పొరేటర్ మా మిండ్ల రాజు ఆధ్వర్యంలో హోలీవేడుకలు నిర్వహించారు. పరకాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను ఆ ధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. హనుమకొండలోని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కు టుంబ సభ్యులతో వేడుకలు జరుపుకున్నారు. కాజీపేట పట్టణంలోని ప్రజలందరూ సోమవా రం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సీఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఎస్సై శివకృష్ణ, నవీన్కుమార్, లవన్కుమార్ బందోబస్తు నిర్వహించారు. బాపూజీనగర్ చౌరస్తాలో ఆదివారం అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులు కా మదహనం నిర్వహించి హోలీ జరుపుకున్నారు.
హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో జరిగిన హోలీ వేడుకల్లో సీపీ అంబర్ కిశోర్ ఝా, డీసీపీలు అబ్దుల్ బారి, రవీందర్, అదనపు డీసీపీలు రవి, సంజీవ్, సురేశ్కుమార్, ఏసీపీలు జితేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి, కిశోర్కుమార్, సత్యనారాయణ, నందిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు హోలీ వేడుకలు నిర్వహించారు. అలాగే, వరంగల్ మ ట్టెవాడ ఏసీపీ కార్యాలయంతో పాటు సివిల్, క్రైమ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది రంగు లు చల్లుకుంటూ, స్వీట్స్ పంపిణీ చేశారు. ఏసీపీ నందిరాం నాయక్కు సీఐలు తుమ్మ గోపి, కే శ్రీధర్తో పాటు పలు పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మట్టెవాడ ఏరియాలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలను ఘ నంగా నిర్వహించారు. 28వ డివిజన్ పిన్నావారివీధిలో కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ దంపతుల ఆధ్వర్యంలో హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. డివిజన్లోని చిన్న పిల్లలకు ఆర్గానిక్ కలర్ ప్యాకెట్లను అందజేశారు. అలాగే, చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి ఆధ్వర్యంలో, ఖానాపురంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో, స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్సై రఘునాథ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. నల్లబెల్లి, పర్వతగిరి మండలాల్లో కూడా హోలీవేడుకలు ఘనంగా జరిగాయి.