కాశీబుగ్గ, నవంబర్ 24 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గన్నీ సంచులకు డబ్బుల చెల్లింపుల అంశంపై తెలుసుకునేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను వరంగల్ మార్కెట్ కమిటీ అధికారులతో పాటు చాం బర్ ప్రతినిధులు గురువారం సందర్శించారు. ఇటీవల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు ఇతర మా ర్కెట్లను పరిశీలించి గన్నీ సంచులకు డబ్బులు ఎలా చెల్లిస్తున్నారో తెలుసుకోవాలని అదేశించారు. అందు లో భాగంగానే ఖమ్మం మార్కెట్ను మార్కెటింగ్ శాఖ డీఎం పాలకుర్తి ప్రసాదరావు, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్రాహుల్, చాంబర్ ప్రధాన కార్యదర్శి మడూ రి వేదప్రకాశ్తో కూడిన బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా వారు రైతులు, వ్యాపారులు, కార్మికులు, మార్కెట్ కమిటీతో మాట్లాడి గన్నీ సంచులకు డబ్బు లు ఎలా చెల్లిస్తున్నారో తెలుసుకున్నారు. అదేవిధంగా క్రయవిక్రయాల తీరును పరిశీలించారు. ప్రతి సంచికీ డబ్బులు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. కార్యక్రమంలో చాంబర్ కోశాధికారి సంపత్, చాంబర్ మాజీ అధ్యక్షు డు కటకం పెంటయ్య, కాటన్ సెక్షన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, కార్యదర్శి నాగభూషణం, ఉపాధ్యక్షులు ఓంకారేశ్వర్, పింగిలి మల్లారెడ్డి, చిల్లీస్ అధ్యక్షు డు రాజేశ్, కరాని, ప్రతినిధి శామంతుల సాంబయ్య, ఉపాధ్యక్షులు వంశీ, మిలాన్.కె.షా, లింగారెడ్డి, రమే శ్, కృష్ణ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.