నయీంనగర్/మడికొండ, ఆగస్టు 27 : కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 20మందికిపైగా యువకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హనుమకొండ ప్రశాంత్నగర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ వారికి పార్టీ కం డువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజాసంక్షేమ పాలనను అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నా రు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో నవీన్, అభి, సుమన్, సాయినాథ్, సురేశ్, హైమద్, శ్యామ్, రాహుల్, మహేశ్, విజయ్, రవిరాజ, విక్రమ్, నాగరాజు, నజీర్ పాషా, శేషు, శ్రావణ్, శశి ఉన్నారు. కార్యక్రమంలో దర్గా పీఏసీఎస్ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు సంపత్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు జైపాల్రెడ్డి, యూత్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే, 46వ డివిజన్ రాంపూర్కు చెందిన ఏర్పుల సారయ్య ఇటీవల మృతి చెందగా దశదిన కర్మకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సారయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వెంట కార్పొరేటర్ మునిగాల సరోజన ఉన్నారు.
వరద బాధితులకు సరుకుల పంపిణీ
వరద బాధిత కుటుంబాలకు సర్కారు అండగా ఉంటుందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ రెండో డివిజన్ భగత్సింగ్నగర్ కాలనీలోని వరద బాధితులకు బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డితో కలిసి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆర్థికసా యం అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రెం డో డివిజన్ అధ్యక్షుడు జంగ కుమార్ యాదవ్, మార్కెట్ డైరెక్టర్ గనిపాక విజయ్, పీఏసీఎస్ చైర్మన్లు మేరుగు రాజేశ్గౌడ్, జక్కు రమేశ్గౌడ్, కాలనీ అధ్యక్షుడు మంద మల్లేశం, పాపయ్య, అమృత, రాజు, సదానందం, భిక్షపతి, తిరుపతి, శ్రీను పాల్గొన్నారు.