హసన్పర్తి, ఏప్రిల్ 26 : సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని మడిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కాదన్నా తెలంగాణ రైతులు ఇబ్బందులు పడొద్దని రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సునీతాప్రసాద్, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ అంచూరి విజయ్, మండలాధ్యక్షుడు రజినీకుమార్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేశ్, మార్కెట్ కమి టీ డైరెక్టర్ వీసం సురేందర్రెడ్డి, సర్పంచ్ చిర్ర సుమలత-విజయ్ ఎంపీటీసీ ఇంద్ర య్య, ఏవో అనురాధ, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు తుమ్మ రాజు, ఎల్ల య్య, కిషన్, సీఏ శ్రీదేవి పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యం..
మడికొండ : రైతును రాజు చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అరూరి అన్నారు. కాజీపేట దర్గా పీఏసీఎస్ ఆధ్వర్యంలో భట్టుపల్లి, కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యాన్ని కొనుగోలు కేం ద్రాల్లోనే విక్రయించాలని కోరారు. వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, జైపాల్రెడ్డి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ సంపత్రెడ్డి పాల్గొన్నారు.
ఐనవోలులో..
ఐనవోలు : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అరూరి అన్నారు. మండలంలోని నందనం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో నడ్డి విరిచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది : డీసీసీబీ చైర్మన్ మార్నేని
రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. రైతుల పెన్నిధి కేసీఆర్ను మూడోసారి కూడా సీఎంగా చేయాలని కోరారు. ఆకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ప్రకటించిన రాష్ట్రం దేశంలోనే తెలంగాణ మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్రావు, ఏవో కవిత, సొసైటీ డైరెక్టర్లు శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, రాంచంద్రయ్య, కుమార్, బాబు, పద్మ, ఏసోబు, సీఈవో కోతి సంపత్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుర్ర రాజశేఖర్, నియోజవర్గ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, మండల యూత్ అధ్యక్షుడు నరేశ్, సర్పంచ్లు యాకర మంజుల, శ్రీనివాస్రావు, బాల్రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడ ఎల్లాగౌడ్, దేవదాసు, సత్యం, గ్రామ అధ్యక్షులు లవణ్కుమార్, అనిల్, రాజు పాల్గొన్నారు.