పంచాయతీ రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇది గుర్తించిన ప్రభుత్వం వెంటనే బీటీ రోడ్ల రెన్యువల్ కోసం నిధులు విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 46 రోడ్ల పరిధిలో 140 కిలోమీటర్ల పంచాయతీరాజ్ బీటీ రెన్యువల్ కోసం రూ.49.48 కోట్లు మంజూరు చేసింది. వర్షాలతో దెబ్బతిన్న మరో మూడు రోడ్లకు రూ.4.65 కోట్లు కేటాయించగా, టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తయితే జిల్లాలోని రహదారులు అద్దంలా మెరుస్తాయని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్, డిసెంబర్ 26(నమస్తేతెలంగాణ) : జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.54.13 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 46 రోడ్లపై 140 కిమీ బీటీ రెన్యువల్కు రూ.49.48, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న మూడు రోడ్ల మరమ్మతులకు రూ.4.65 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఈ నిధులతో పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
బీటీ రెన్యువల్ కోసం పర్వతగిరి మండలంలోని పర్వతగిరి- రోల్లకల్ రోడ్డుకు రూ.2.15 కోట్లు, జెడ్పీరోడ్డు- ఈదులగడ్డతండ రోడ్డుకు రూ.36 లక్షలు, ఏనుగల్ నుంచి హట్యాతండా మీదుగా చౌటపల్లి రోడ్డుకు రూ.1.04 కోట్లు, ఏనుగల్-తూర్పుతండా రోడ్డుకు రూ.54 లక్షలు, ఏనుగల్ జడ్పీ రోడ్డు నుంచి మూడుతండా, శివతండా మీదుగా గుగులోత్ తండా రోడ్డుకు రూ.50 లక్షలు, వర్ధన్నపేట మండలంలోని జడ్పీ రోడ్డు- బండౌతాపురం రోడ్డుకు రూ.98 లక్షలు, ఉప్పరపల్లి- చెన్నారం రోడ్డుకు రూ.1.60 కోట్లు, ఇల్లంద పీడబ్ల్యూడీ రోడ్డు- నల్లబెల్లి రోడ్డుకు రూ.50 లక్షలు, నల్లబెల్లి ఎస్సీకాలనీ- తిమ్మాపూర్ రోడ్డుకు రూ.50 లక్షలు, చెన్నారం- కాశగూడెం రోడ్డుకు రూ.62 లక్షలు, పర్వతగిరి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నల్లబెల్లి రోడ్డుకు రూ.92 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.
రాయపర్తి మండలంలోని సన్నూరు క్రాస్రోడ్డు నుంచి జయరాంతండా(ఎస్) రోడ్డుకు రూ.77 లక్షలు, మైలారం-జగన్నాథపల్లి రోడ్డుకు రూ.1.56 కోట్లు, అప్రోచ్రోడ్డు- పనిష్తండా రోడ్డుకు రూ.43 లక్షలు, అప్రోచ్రోడ్డు నుంచి వంపుతండా మీదుగా ఏకేతండా వరకు ఉన్న రోడ్డుకు రూ.ఒక కోటి, ఆర్అండ్బీ రోడ్డు- గణేశ్కుంటతండా రోడ్డుకు రూ.ఒక కోటి, ఊకల్ క్రాస్రోడ్డు- కొత్తతండా రోడ్డుకు రూ.43 లక్షలు, కొండూరు నుంచి ఈదులతండా మీదుగా కేశవపురం వరకు గల రోడ్డుకు రూ.1.58 కోట్లు, కొండాపురం క్రాస్రోడ్డు- సూర్యతండా రోడ్డుకు రూ.1.12 కోట్లు, ఏకేతండా జడ్పీ తండా- తూర్పుతండా రోడ్డుకు రూ.71 లక్షలు, మహబూబ్నగర్ నుంచి టేకులతండా మీదుగా ల్యాబర్తికి రూ.66 లక్షలు మంజూ రు చేసినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.
దుగ్గొండి మండలంలోని వెంకటాపురం- రేబల్లె రోడ్డుకు రూ.67 లక్షలు, గిర్నిబావి నుంచి చాపలబండ మీదుగా గోబ్రియతండాకు రూ.1.97 కోట్లు, లక్నేపల్లి ఆర్అండ్బీ రోడ్డు- శివాజీనగర్ రోడ్డుకు రూ.69 లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు- మైసంపల్లి రోడ్డుకు రూ.47 లక్షలు, నర్సంపేట మండలంలోని మహేశ్వరం ఆర్అండ్బీ రోడ్డు- పర్శనాయక్తండా రోడ్డుకు రూ.1 కోటి, జడ్పీ రోడ్డు నుంచి దాసరిపల్లి మీదుగా కమ్మపల్లికి రూ.1.60 కోట్లు, ఎన్హెచ్ 365 రోడ్డు నుంచి నర్సింగపూర్ రోడ్డుకు రూ.44 లక్షలు, గురిజాల నుంచి జీజీఆర్ రాజపల్లి మీదుగా గోబ్రియాతండాకు రూ.1.50 కోట్లు, చంద్రయపల్లి-దాసరిపల్లి రోడ్డుకు రూ.15 లక్షలు, జడ్పీ రోడ్డు- రాజేశ్వర్రావుపల్లె రోడ్డుకు రూ.35 లక్షలు, నల్లబెల్లి మండలంలోని మేడపల్లి నుంచి లైన్తండా మీదుగా కొండాపూర్కు రూ.1.45 కోట్లు, నాగరాజుపల్లి క్రాస్రోడ్డు-మూడుచెక్కలపల్లి రోడ్డుకు రూ.91 లక్షలు, రుద్రగూడెం-కొండాపూర్ రోడ్డుకు రూ.3.40 కోట్లు, రంగాపూర్- ముచ్చింపుల రోడ్డు కు రూ.63 లక్షలు మంజూరు చేసింది.
గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి- మునుగొండ రోడ్డుకు రూ.1.65 కోట్లు, స్థంభంపల్లి- వంచనగిరి రోడ్డుకు రూ.1.12 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి గీసుగొండ మీదుగా చంద్రయ్యపల్లికి రూ.1.91 కోట్లు, శాయంపేట మీదుగా రాయినికుంటకు రూ.1.85 కోట్లు, గీసుగొండ-మరియపూర్ రోడ్డుకు రూ.43 లక్షలు, సంగెం మండలంలోని సంగెం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గవిచర్ల, రామచంద్రాపూర్, లోహిత గ్రామాల మీదుగా ఉప్పరపల్లి వరకు ఉన్న రోడ్డుకు రూ.2.42 కోట్లు, కాట్రపల్లి- గవిచర్ల రోడ్డుకు రూ.1.52 కోట్లు, తిమ్మాపూర్ పీడబ్ల్యూడీరోడ్డు నుంచి ఎల్గూరురంగంపేట మీదుగా ముమ్మిడివరం వరకు రూ.1.52 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వంచనగిరి, లోహిత జడ్పీ రోడ్డు-షాపూర్ రోడ్డుకు రూ.64 లక్షలు, నల్లబెల్లి పీఆర్ రోడ్డు నుంచి నార్లవాయి మీదుగా రంగాపూర్కు రూ.1.40 కోట్లు, మచ్చాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వంజరపల్లి మీదుగా పల్లారుగూడ రోడ్డుకు రూ.82 లక్షలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
మూడింటికి మరమ్మతులు..
ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల సంగెం, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలోని మూడు రోడ్ల మరమ్మతులకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కొద్దిరోజుల క్రితం పంచాయతీరాజ్శాఖ ఇంజినీరింగ్ విభాగానికి అందాయి. సంగెం మండలంలోని తిమ్మాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఎల్గూరురంగంపేట మీదుగా ముమ్మడివరం గ్రామం వరకు ఐదు కిమీ రోడ్డు మరమ్మతులకు రూ.3.50 కోట్లు, వర్ధన్నపేట మండలంలోని తిమ్మాపూర్-మూడుగుండ్లతండా రోడ్డులోని 2.50 కిమీ రోడ్డు మరమ్మతులకు రూ.75 లక్షలు, రాయపర్తి మండలంలోని జడ్పీ రోడ్డు- గన్నారం రోడ్డులోని 2 కిమీ రోడ్డు మరమ్మతులకు రూ.40 లక్షలు మం జూరు చేసింది. 46 రోడ్లపై బీటీ రెన్యువల్, మూడు రోడ్ల మరమ్మతులకు సంబంధించిన పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు కేటాయించేందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం జిల్లా కార్యనిర్వాహక ఇంజినీర్(ఈఈ) శంకరయ్య తెలిపారు. సాధ్యమైనంత త్వరలో పనులు మొదలుపెడుతామని ఆయన వెల్లడించారు.