శాయంపేట, అక్టోబర్7: మత్స్య కార్మికుల అభి వృద్ధే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జడ్పీ చైర్పర్స న్ గండ్ర జ్యోతితో కలిసి మండలంలోని చలివాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను శుక్రవారం పోశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్నదని న్నారు. చేప పిల్లలను పట్టుకొని ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. 13 గ్రా మాల సభ్యులు కూర్చుని మాట్లాడుకుని సొసైటీ ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఎన్నుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు అంది స్తున్నందున వాటిని సొసైటీల ద్వారా అందిపు చ్చుకోవాలన్నారు.
ఎమ్మెల్యేకు మత్స్య కార్మికుల ఫిర్యాదు
మూడేళ్లుగా ఉచిత చేప పిల్లలను కాంట్రాక్టర్ తకువగా పోస్తూ నష్టం చేస్తున్నారని మత్స్య కా ర్మిక నాయకులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చేపలను చెరువు ల్లో పోయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశిం చారు.సొసైటీ కమిటీ కోసం నోటిఫికేషన్ను వెంట నే ఇవ్వాలని అక్కడే ఉన్న మత్స్యశాఖ అధి కారికి గండ్ర దంపతులు సూచించారు. 11లక్షల చేప పిల్లలకు కేవలం 2లక్షల పిల్లలే తీసుకురావ డంతో మత్స్యకారులు ఎమ్మెల్యే గండ్ర దృష్టికి తీసుకెళ్లా రు. దాంతో జిల్లా మత్స్యసొసైటీ అధ్య క్షుడు బుస్స మల్లేశం మిగిలిన 9లక్షల చేపపిల్లలు దగ్గరుండి పోయించే బాధ్యత తనదేనని ఒప్పుకు న్నారు. చలివాగులో ఉచిత చేపపిల్లలు పో సేందు కు వచ్చిన జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభా రతిని మత్స్యకార్మికులు ప్రశ్నించారు. చేపపిల్లల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీ సుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మె తుకు తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, మత్స్యసొసైటీ జిల్లా అధ్య క్షుడు బుస్స మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ శరత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు రాంశెట్టి లక్ష్మారె డ్డి, దైనంపెల్లి సుమన్, రమణారెడ్డి ఉన్నారు.