ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మానుకోట జిల్లాపై వరాల వాన కురిపించారు. మహబూబాబాద్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50కోట్లు, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున, జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున ఇస్తామని చెప్పగానే సభికులు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ స్వాగతించారు. ‘దివంగత నాయకుడు నూకల రామచంద్రారెడ్డి లాంటి వారు పుట్టిన గొప్ప గడ్డ మహబూబాబాద్, ఆ మహనీయుడిని భావితరాలు స్మరించుకోవాలి’ అని మానుకోట ప్రత్యేకతను గుర్తు చేశారు.
వరంగల్, జనవరి 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మానుకోట జిల్లాపై వరాల వాన కురిపించారు. జి ల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరుతో పా టు నాలుగు మున్సిపాలిటీలకు మొత్తం రూ.125కోట్లు కేటాయిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ను గురువారం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు. సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
‘తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇకడ చాలా దారుణమైన కరువు పరిస్థితులుండేవి. వర్ధన్నపేట, పాలకుర్తి ప్రాం తాల్లో తిరిగినప్పుడు అకడ సగం గీకిన కాలువలు చూ సి ఈ జన్మలో నీళ్లు రావు అని చాలా బాధపడ్డా. తల్లీ గోదావరి మా నేలమీదకు ఎప్పుడొస్తావు, మా కరువు ఎప్పుడు తీరుస్తావు అంటూ దండం పెట్టుకునేవాడిని. తెలంగాణ వస్తే బంగారు మీసాలు చేయిస్తా అని కురవి వీరభద్రస్వామికి కడుపునిండా మొకుకున్నా. స్వామి దయ, మీరు చేసిన ఉద్యమం, మానుకోట రాళ్ల బలం అన్నీ కలిసి అద్భుత రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ ఏర్పాటైనందు వల్లే మహబూబాబాద్ జిల్లా అయ్యింది.
ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉన్నది. ఈ కలెక్టరేట్ ప్రజా కార్యాలయంగా, ప్రజాసమస్యలు తీర్చే వేదికగా ఉండాలి. మహబూబాబాద్లోనూ మెడికల్ కాలేజీ వచ్చింది. ఇలాంటి అభివృద్ధి ఇంకా చాలా జరగాల్సి ఉన్నది. తండాలను పంచాయతీలుగా చేయాలని గిరిజనులు 50 ఏండ్లుగా అడిగిండ్రు. తెలంగాణ వచ్చినంక మనం తండాలను, గిరిజన గూడేలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నం. మహబూబాబాద్ జిల్లాలో 461 గ్రామ పంచాయతీలున్నయి. తెలంగాణ వచ్చినంక కొత్తగా 283 పంచాయతీలు అయినయ్. మన గిరిజన, ఆదివాసీ బిడ్డల చేతుల్లోనే అధికారం ఉన్నది. వాళ్ల తండాలను వాళ్లే చాలా బాగా అభివృద్ధి చేసుకుంటున్నరు. నాకు సంతోషంగా ఉన్నది. ఇలాంటి అభివృద్ధి ఇంకా జరగాలి’ అని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్కు అభినందనలు
మహబూబాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ను, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాంమ్మోహన్రెడ్డిని అభినందించారు. మరింత అభివృద్ధి చేయాలని సూ చించారు. ఇందుకోసం నిధులు కేటాయించారు. ‘మహబూబాబాద్ మున్సిపాలిటీ బాగా మారింది. ఎమ్మె ల్యే శంకర్నాయక్ను, మున్సిపల్ చైర్మన్ను అభినందిస్తున్న. పార్టీ ఆఫీసు ప్రారంభించి నేను బస్సుల వస్తుం టే చూసిన. ఇంకా కొన్ని డ్రైనేజీలు, సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉన్నయి. గిరిజన ప్రాంతాలు బాగా అభివృద్ధి కావాలి. అందుకే ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తు న్న. కలెక్టర్ శశాంక స్థానిక ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను సమన్వయం చేసుకుని సద్వినియోగం చేయాలి. గ్రామాలకు ఇచ్చే నిధులను సర్పంచుల నిర్ణయం మేరకు ఖర్చు చేసేలా అధికారులు చర్య లు తీసుకోవాలి. మహబూబాబాద్ జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
మహబూబాబాద్ గడ్డ గొప్పది..
ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ ప్రాంత ప్రత్యేకతను గుర్తు చేశారు. ఈ గడ్డ గొప్పదని, ఇక్కడ దివంగత నాయకుడు నూకల రామచంద్రారెడ్డి లాంటి వారు పుట్టారని పేర్కొన్నారు. నూకల రామచంద్రారెడ్డి తెలంగాణ కోసం తపించారని, అప్పట్లోనే ప్రత్యేకంగా ఫోరం ఏర్పాటు చేశారని, ఆ మహనీయుడిని భావితరాలు స్మరించుకోవాలని చెప్పారు. నూకల రామచంద్రారెడ్డి దేశానికి ప్రధానమంత్రిగా పని చేసిన పీవీ నర్సింహారావుకే గురువు అని చెప్పారు. ‘సమైక్య రాష్ట్రంలో మన నేతలకు గుర్తింపు దక్కలేదు. నూకల రామచంద్రారెడ్డికి మనం ఘనంగా నివాళులర్పిద్దాం. ఏదైనా సంస్థకు ఆయన పేరు పెట్టుకుందాం.
మహబూబాబాద్, వరంగల్లో ఆయన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసుకుందాం’ అని సీఎం అన్నారు. ‘మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో 24గంటలు కరెంటు ఇయ్యగలుగుతున్నం.. దేశంలో ఒక్క తెలంగాణలోనే ఇది జరుగుతున్నది. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతి, సహనంతోని, సర్వజనుల సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలె.. మత పిచ్చి లేపి, కుల పిచ్చి లేపి, ప్రజలను చీలదీసి, విడదీసే పద్ధతులను అవలంబిస్తే అదొక నరకంలా తయారవుతుంది. ఒక తాలిబన్ వ్యవహారంలా ఒక అఫ్ఘనిస్తాన్లా తయారైతది.. విద్వేషాలతోని రేపు జాతి జీవనాడి దహించుకుపోయే పరిస్థితి వస్తది.
దయచేసి యువకులు అప్రమత్తంగా ఉండాలె. తెలివిగా ఆలోచించాలె. మేధావులు చర్చ పెట్టాలె. ఇక్కడ మనం చెప్పుకున్న విషయాలను ఊరికి పోయినంక చర్చించుకోవాలె.. యావత్తు దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి ఇమిడి ఉంటది. అందుకే మనం ఆ చైతన్యాన్ని అలవర్చుకోవాలె. దేశానికి ఒక వెలుగు మార్గం చూపెట్టే అద్భుతమైన వెలుగు వీచిక మన తెలంగాణ నుంచి వీయాలె.
అందులో మీరందరూ భాగస్వాములు కావాలె.’ అని యువతకు, మేధావులకు పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ బాల సుమన్, ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు బానోతు శంకర్నాయక్, డీఎస్.రెడ్యానాయక్, బానోతు హరిప్రియ, టీ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్లు అంగోతు బిందు, గండ్ర జ్యోతి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ కలెక్టర్ శశాంక, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎండకాలంలో చెరువులు మత్తళ్లు..
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. కాల్వల ద్వారా చెరువులు నింపుతున్నాం. నా 40ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు.. ఎండకాలంలో చెరువులు మత్తళ్లు పోయడం ఇప్పుడే చూస్తున్నా.. నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలు, తండాల్లో కుండలు, బిందెలు పట్టుకొని తిరిగేవాళ్లు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణ, గోదావరి నీళ్లు ఫిల్టర్ చేసి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ప్రజల చెంతకు పాలన..
గత ప్రభుత్వాల హయాంలో కలెక్టరేట్కు వెళ్లాలంటే సద్దులు కట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఒక పేదవాడు అర్జీ తీసుకొని వస్తే సమస్యలన్నీ ఒకేచోట పరిష్కారయ్యేలా సీఎం కేసీఆర్ అన్ని కార్యాలయాలను ఒకే చోట నిర్మించారు. ప్రజల చెంతకు పాలనను తెచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజనులకు గుర్తింపు తెచ్చారు. అడగకుండానే అన్నీ ఇస్తూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
– మంత్రి సత్యవతి రాథోడ్
ఇంద్రభవనంలా కలెక్టరేట్లు..
నేను కలెక్టర్గా పని చేసిన సమయంలో జిల్లాల్లో సరైన వసతులు లేవు. ప్రస్తుతం నిర్మిస్తున్న కలెక్టరేట్లు ఇంద్ర భవనాల్లా ఉన్నాయి. ఉద్యోగులు ఆహ్లాదకర వాతావరణంలో పని చేసేలా సీఎం కేసీఆర్ వసతులు కల్పిస్తున్నారు. ప్రపంచమే ఆశ్చర్య పోయేలా తెలంగాణలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో ప్రజల చెంతకు ప్రభుత్వ పాలన చేరింది.
– శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి