కాజీపేట, ఏప్రిల్ 16 : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట పట్టణంలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. సర్వమత సమ్మేళనంలో భాగంగా వివిధ మత గురువులు, ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు పండ్లను అందజేశారు. అంతకు ముందు రంజాన్ కానుకలను పేద ముస్లింలకు పంపిణీ చేసి, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తున్నారని, అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. దసరా, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నూతన వస్ర్తాలను ప్రభుత్వం తరఫున కానుకగా అందజేస్తున్నారని చెప్పారు.
మతసామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఆరు రోజుల పాటు పలు చోట్ల ఇఫ్తార్ విందు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లా దయవల్ల సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మైనార్టీ అధికారి మేన శ్రీనివాస్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, కార్పొరేటర్ సంకు నర్సింగరావు, ఎలకంటి రాములు, ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, రైతు బంధు సమితి సభ్యుడు సుంచు కృష్ణ, మత పెద్దలు, బిషప్ జాన్ మార్కండేయ, ఆషిజ్ ఆలం, అయ్యాల దానం, ప్రవీణ్కుమార్ శర్మ, జాగర్లపూడి శ్రీనివాస్ శర్మ, బీఆర్ఎస్ ముస్లిం నాయకులు నసీరుద్దీన్, సోని, ఫర్హాన్, సయ్యద్ సర్వర్, అఫ్జల్, హుస్సేన్, నయీం జుబేర్, మహమూద్, అయూబ్, యాకూబ్, ఎస్కే జానీ, నయీముద్దీన్, నాయకులు నార్లగిరి రమేశ్, శిరుమల్ల దశరథం, గబ్బెట శ్రీనివాస్, దువ్వ కనుకరాజు, పాలడుగుల శివకుమార్, తేలు సారంగపాణి, సుంచు అశోక్ కుమార్, రఘురాం, కాటాపురం రాజు, సుంకు కృష్ణ, వినయ్, రంజిత్, శేఖర్, రాంచందర్, మర్యాల కృష్ణ, సిరిల్ లారెన్స్, షర్వీన్ పాల్గొన్నారు.