జనగామ చౌరస్తా, ఆగస్టు 14 : జనగామ పట్టణ కేం ద్రంతో పాటు గ్రామాల్లో ఆదివారం పోశమ్మ బోనాలు కనుల పండువలా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని పోశమ్మ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. పిల్లా పా పలు, పాడి పంటలు సమృద్ధిగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు.
జనగామ రూరల్లో..
జనగామ రూరల్: శ్రావణ మాసం ఆదివారం కావడంతో పల్లెల్లో బోనాల పండుగను మండలంలో పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండలంలోని సిద్దెంకి, పెంబర్తి, పెద్దరాంచర్ల తదితర గ్రామాల్లో బోనాల పండుగ ఉత్సాహంగా గ్రామస్తులు జరుపుకున్నారు. మహిళలు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పునకాలతో వీధుల గుండా ఆలయాలకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గ్రామంలోని కుల దేవతలు బీరప్ప, పోశ మ్మ, పెద్దమ్మ దేవతలకు అన్నీ కులాల వారు బోనాలు సమర్పించుకున్నారు. పిల్లాపాపలు, పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేవతలకు మొక్కులు చెల్లించుకు న్నారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పుంచ్లు, వార్డు సభ్యులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
మండల కేంద్రంతో పాటు పలు గ్రామా ల్లో ఆదివారం పోశమ్మకు ప్రజలు బోనాలు సమర్పించుకున్నారు. నూతన వస్ర్తాలు అమ్మవారికి సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బచ్చన్నపేటలో మొదటిసారి వడ్ల, కమ్మరి కులస్తులు డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు తీసుకెళ్లారు. అదే విధంగా బండనాగారంలో ప్రజలు ఘనంగా పోశమ్మకు బోనాలు సమర్పించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు వీ మల్లారెడ్డి, శివరాత్రి కవితారాజనర్సు, ఉప సర్పంచ్లు హరికృష్ణ, రాజలింగం, కే రాములు, కే మహత్మాచారి, వెంకటాచారి, శ్రీనివాస్, నర్సింహాచారి, వెంకటేశ్, బాలరాజు, బ్రహ్మచారి, కార్తీక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తరిగొప్పులలో..
మండలంలోని సోలిపురం గ్రామ శివారులోని నల్ల పోశమ్మకు ఆదివారం భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. శ్రావణ ఆదివారం కావడంతో మండలంతో పాటు చుట్టు పక్క మండలాలు నర్మెట, మద్దూరు, అక్కన్నపేట, చిల్పూర్ మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
లింగాలఘనపురంలో..
మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పోశమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గుమ్మడవెల్లి, కొత్తపెల్లి, వడిచర్లలోని పోశమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. వడిచర్లలో నేత కార్మికులు గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీలో మగ్గాన్ని ఏర్పాటు చేసి, పట్టు చీరెను నేసి, గ్రామ శివారులోని పోశమ్మకు నేసిన చీరెను సమర్పించారు. పిల్లాపాపలను సల్లంగా చూసి, తమ కులవృత్తిని కాపాడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నేత కార్మికులు చిటుకల అంజయ్య, యనగందుల నర్సయ్య, గుజ్జ నరేందర్, బేతి యాదగిరి, గుండ అంజయ్య, వెంకటేశ్, ప్రభాకర్, రాములు, ఉపేందర్, అంబదాసు, చిటుకల అశోక్, శ్రీను, రేణుక, వజ్రమ్మ, వంగ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆయా గ్రామాల్లో సర్పంచ్లు కత్తుల శ్రీపాల్రెడ్డి, తుంగ స్రవంతీనాగరాజు, కడారి కృష్ణ, వైస్ ఎంపీపీ కే కిరణ్కుమార్, ఎంపీటీసీ గండి మంగవ్వ యాదగిరి, కార్యదర్శులు ఆలయాల సమీపంలో సౌకర్యాలు కల్పించారు.