హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 19: చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రుద్రేశ్వరి-రుద్రేశ్వరుడికి నాగవెల్లి సదస్యం నిర్వహించారు. గణపతి పూజ నిర్వర్తించి, నల్లపూసలకు గౌరీపూజ నీలాంబరీసూక్తంతో వేదోక్తంగా కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి ధరింపజేశారు.
సోమవారం స్వామికి రుద్రాభిషేకం నిర్వర్తించి 51 కిలోల పెరుగన్నంతో మహాన్నపూజ నిర్వహించనున్నట్లు అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. ఈవో జి. శేషగిరి ఉత్సవ అధికారి ఎం. అనిల్, అర్చకులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, సిబ్బంది సేవలందించారు. వద్దిరాజు వెంకటేశ్వర్లు, గోపీనాథ్, తాటిపెల్లి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, మాడిశెట్టి సాంబయ్య, మండువ శేషగిరిరావు, వేముల సత్యమూర్తి, ఐనవోలు వెంకట సత్యమోహన్ తదితరులు పాల్గొన్నారు.