దుగ్గొండి, నవంబర్ 25 : సబ్బండ వర్గాల అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎ మ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మండలంలోని నాచినపల్లి గ్రామంలో ముదిరాజ్ల కులదైవం పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మె ల్సీ బండా ప్రకాశ్ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్లు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ముదిరాజ్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపపిల్లల విడుదలతో పాటు మోపెడ్లు, డీసీఎంలను అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముదిరాజ్లను ఆదుకుంటామన్నారు.
ఆలయాభివృద్ధికి నిధులు : పెద్ది
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయాలు, పురాతన కట్టడాలను పునరుద్ధరిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాభివృద్ధికి రూ. 4లక్షల సీడీఎస్ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజ్ల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికై మొట్టమొదటిసారి మండలానికి వచ్చిన బండా ప్రకాశ్కు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే పెద్ది ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమల, వైస్ ఎంపీపీ పల్లాటి జేపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, నాయకులు గుండాల మదన్కుమార్, గొడుగు శ్రీనివాస్, పొన్నం మొగిలి, ముత్యాల శ్రీనివాస్, బుస్సాని రమేశ్, పల్లె రమేశ్, నాచినపల్లి ఎంపీటీసీ నరగబోయిన మమత, ఉపసర్పంచ్ జంగా రాజిరెడ్డి, మామిడాల వేణు, మాజీ ఎంపీటీసీ మట్ట సుజాత తదితరులు పాల్గొన్నారు.