వరంగల్ : అనునిత్యం ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ( Minister Errabelli) కు వెన్నంటి అండగా ఉంటామని తండావాసులు ప్రమాణం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జేస్రాం తండా పంచాయతీ పరిధిలోని రావుల తండా, విద్యానగర్ తండాలకు చెందిన వంద మంది పెద్దలు, ముఖ్య నాయకులు, యువకులు సంగెం మండలం కాపుల కనపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ను కలిసి మద్దతు (Support) ప్రకటించారు.
తాము మొదటి నుంచి మంత్రి దయాకర్ రావుతోనే ఉన్నామని, భవిష్యత్తులోనూ ఆయనతోనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్ని కష్ట, నష్టాలొచ్చినా దయన్నతోనే ఉంటామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా తండావాసులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తండావాసుల రుణం తీర్చుకునే విధంగా వారికి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి, ఆకుల సురేందర్ రావు తదితరులు ఉన్నారు.