హసన్పర్తి, జూలై 9 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్మీడియా ద్వారా తి ప్పికొట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎర్రగట్టుగుట్ట సమీపంలోని కేఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో హసన్పర్తి మండల యూత్, సోషల్ మీడియా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం యూత్ అధ్యక్షుడు మేక భగవాన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే రమేశ్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి అరూరి విశాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ తెలంగాణలో అమలయ్యే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ వారియర్స్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కృషిచేయాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షే మ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు.
పీఏసీఎస్ భవనానికి శంకుస్థ్ధాపన
హసన్పర్తిలో పీఏసీఎస్ భవన నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే రమేశ్ శంకుస్థా పన చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్కుమార్, వైస్ చైర్మన్ పాడిమల్లారెడ్డి తదితరులు ఎమ్మెల్యే రమే శ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్రావును శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్, నోడల్ ఆఫీసర్ జగన్మోహన్రావు, ఆత్మ చైర్మన్ కుందుకూరి చంద్రమోహన్, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి, జడ్పీటీసీ సునీత, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేశ్గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, డైరెక్టర్లు నేదునూరి కుమారస్వామి, చేరాలు, జానకి, రవీందర్రెడ్డి, భగవాన్రెడ్డి కర్ణాకర్రెడ్డి, రమేశ్, బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, మాజీ జడ్పీటీసీ సుభాష్గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు తుమ్మ రాజు, మదన్గౌడ్, యూత్ నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
గ్రేటర్ 55వ డివిజన్ రామారానికి చెందిన తోట భిక్షపతితోపాటు 66వ డివిజన్ హసన్పర్తికి చెందిన బల్సుకూరి శ్రీధర్ తండ్రి వర్ధంతికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం హాజరై వారి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అలాగే, తెలంగాణ ఉద్యమ గాయకుడు వేద సాయిచంద్ దశదిన కర్మ సందర్భంగా భీమారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ జక్కుల రజితా-వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, చల్లా వెంకటేశ్వర్లు, నాగరాజు, యూత్ అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు.