ఐనవోలు/పర్వతగిరి, మే 25 : పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఐనవోలు, పర్వతగిరి మండలకేంద్రాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ ముఖ్య నాయకులు, ఇన్చార్జీలతో శనివారం ఆయన సమీక్షించారు.
అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాజేశ్రెడ్డిని గెలిపించాలన్నారు. రాకేశ్రెడ్డి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆయాచోట్ల సమావేశాల్లో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ అలీ, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, ఐనవోలు మండల ఇన్చార్జి గుజ్జ గోపాల్రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు, దేవేందర్, నాయకులు ఎల్లాగౌడ్, కుమార్, అశోక్, అనిల్, చందు, భిక్షపతి, ఏడుదొడ్ల జితేందర్రెడ్డి, రాజేశ్వర్రావు, మనోజ్కుమార్గౌడ్, మాడుగుల రాజు పాల్గొన్నారు.