గీసుగొండ, ఫిబ్రవరి 24: కొమ్మాల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వైపున 65 అడుగుల ఎత్తుతో దాతల సహ కారంతో రూ. 80 లక్షలతో నిర్మించిన రాజగోపురాన్ని శుక్ర వారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు రామాచార్యు లు, ఫణీంధ్ర, విష్ణు రాజగోపురం ప్రారంభోత్సవం, శిఖర ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకల ను వైభవంగా నిర్వహించారు.
రాజగోపురం నిర్మాణంతో ఆలయం నూతన శోభను సంతరించుకొంది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ బస్వ రాజ్ సారయ్య స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించి న యాగం లో మంత్రి దయాకర్రావు పాల్గొన్నారు. అనంతరం మొ క్కను నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. దయాకర్రావు సానుకూ లంగా స్పందించి కాటేజెస్ ఏర్పాటుతో పాటు మౌలిక వస తుల కల్పనకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికా రులను కోరారు. ఆలయ ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి గుడి అభివృద్ధికి నిధులు మంజూరయ్యేలా చూ స్తానని ఆయన పేర్కొన్నారు.
రాజగోపురం నిర్మాణానికి సహకరించిన దాతలకు ఎర్రబెల్లి ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. కార్యక్రమంలో దాతల సమన్వయకర్త కోనె వెంకట గిరి, ఆలయ ధర్మకర్త శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ కుమారస్వామి, మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ సౌజన్య, కొమ్మాల సర్పంచ్ వీరాటి కవిత, సూర్యాతండా సర్పంచ్ వాంకుడోతు రజిత, వివిధ గ్రామాల సర్పంచ్లు అంకతి నాగేశ్వర్రావు, బోడకుంట ప్రకాశ్, జైపాల్రెడ్డి, కార్పొరేటర్లు మనోహర్, బాబు, మనీషాశివకుమార్, బీఆ ర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, ఈవో శేషగిరి, ఎంపీడీవో వీరేశం, దాతలు, సందీప్, కోను శ్యామల, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.