ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా తడిసిముద్దయింది. ముసురు పట్టి ఈదురు గాలులు వీస్తుండడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షాలకు వరద పోటెత్తడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మతడి దుంకుతున్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం మున్నేరు, ఆకేరు, పాలేరు వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసర సమయంలో హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. కాగా, వర్షాల కారణంగా పంటలు నీటమునిగాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 18.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బయ్యారం , జూలై 12 : మండలంలో ఆరు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. బయ్యారం పెద్ద చెరువు ఉధృతంగా మత్తడి దుంకుతున్నది. బ య్యారం పెద్దగుట్టపై పాండవుల జలపాతం, చింతోనిగుంపులోని వంకమడు గు జలపాతం జాలువారుతున్నది. తులారం, వట్టెవాగు, అలిగెరు, పాకాల ఏరు నీటి తాకిడి పెరిగింది. మశివాగు, పంది పంపుల వాగు ప్రవాహంతో పలు ఏజెన్సీ గ్రామాలకు రాక పోకలు స్తంభించాయి. ప లు గ్రామాల్లో ఇండ్లు కూలీ పోయాయి. ప్రజలకు ఇబ్బం ది కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డోర్నకల్లో..
మండలంలోని వెన్నారం గ్రామ శివారులో గంగమ్మ గుడి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీం తో వెన్నారం నుంచి తోడేళ్ల గూడెం, ముల్కలపల్లి, ఖ మ్మం వెళ్లే ప్రధాన రహదారి రాకపోకలు నిలిపివేశారు. డోర్నకల్, ముల్కలపల్లి శివారులోని మున్నేరు, ఆకెరు వా గు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెన్నారం, పెరుమాండ్ల సంకీస, చిలుకోడుల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయి.
అలుగుపోస్తున్న కోడి చెరువు
గూడూరు : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలతో చెరువులు పూర్తిగా నిండుకుండలా మారాయి. మండలంలోని కోడిచెరువు మంగళవారం నుంచి అలుగు పోస్తున్నది. కాగా, అదే చెరువు కట్ట కొంతమేరకు దెబ్బతినడంతో వెంటనే అప్రమత్తమైన రైతులు తహసీల్దార్ అశోక్కుమార్కు విషయం తెలియ జేయగా, ఆయన ఐబీ అధికారులను పిలిచి చెరువు కట్టకు తాత్కలికంగా మరమ్మతులు చేపట్టారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు..
కొత్తగూడ: ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండడంతో గ్రామాల నుంచి రాకపోకలు స్తంభించాయి. మండలంలోని గాదెవాగు, బూర్గపల్లి వాగు, కత్తెరల వాగులు ఉప్పొంగుతున్నాయి. దీంతో రాకపోకలు చేయవద్దని కోరుతూ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పకడ్భందీగా చర్యలు చేపట్టారు.
కేసముద్రంలో..
మండలంలో మంగళవారం ఎడతెరిపి లేని వాన కురిసింది. మండలంలోని కల్వల చెరువు మత్తడి దుంకుతున్నది. ఉప్పరపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వంట షెడ్డు కూలిపోయింది.
చిన్నగూడూరులో..
మండలంలో మంగళవారం ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. మండలంలోని ఆయా గ్రా మాల్లో వర్షపు నీరు చేరి చెరువులు మత్తడి దుంకుతన్నాయి. మండల కేంద్రానికి చెందిన బొల్లు యాకన్న రేకుల ఇల్లు కూలిపోయింది. ఆకేరు, జిన్నలవాగును స్థానిక ఎంపీడీవో శ్యాంసుందర్, ప్రత్యేకాధికారి నర్సింహాస్వామి పర్యవేక్షించారు.
పెద్దవంగరలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంలో నిమ్మల బయ్యమ్మ ఇల్లు కూలి పోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పంచనామ నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు తెలిపారు. ఆర్ఐ లష్కర్, రెవెన్యూ సిబ్బంది వెంకన్న ఉన్నారు.
మత్తడి పోస్తున్న బంధం చెరువు..
నర్సింహులపేట: మండల కేంద్రంలోని బంధం చెరువు, పడమటిగూడెంలోని గుండ్ల చెరువు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఆకేరు వాగు ఉధృత్తంగా ప్రవహిస్తున్నది. గ్రామాల్లో రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీవో సోంలాల్ తెలిపారు.
దంతాలపల్లిలో..
మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చేరువులు, కుంటలు నిండుకున్నాయి. పాలేరు వాగు అధృతంగా ప్రవహిస్తున్నది. మండలంలోని పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, రేపోణి గ్రామాల్లో చేరువులను తహసీల్దార్ కిశోర్కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ నూకల హిమబిందు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు .
జిల్లాలో 18.84 సెంటీమీటర్ల వర్షపాతం
మహబూబాబాద్ రూరల్: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జిల్లాలోని మొత్తం 18.84 సెంటీమీటర్లు వర్షం కురియగా 2.35 శాతం నమోదైంది. కొత్తగూడ మండలంలో 8.3 సెంటీమీటర్లు. బయ్యారంలో 2.36, గార్లలో 1.92, డోర్నకల్లో 2, కురవిలో 2.12, మానుకోటలో 2.64, గూడూరులో 4.61, కేసముద్రంలో 2.02, నర్సింహులపేటలో 2, నెల్లికుదురులో 2.10, మరిపెడలొలో 2.21, దంతాలపల్లిలో 1.81, తొర్రూరులో 1.24, పెద్దవంగరం 1.32, చిన్నగూడూలో 1.91 శాతం వర్షం నమోదైంది.