నెల్లికుదురు, జూన్ 28 : వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితా ల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీ వించేందుకు వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. అత్యంత వెనుకబడిన తరగతులకు రూ.లక్ష అందించే కార్యక్రమాన్ని దశాబ్ది వేడుకల సం దర్భంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇందుకోసం జి ల్లాలో వివిధ వృత్తి కులాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించి ప్రతి నెలా 15న విడతల వారీగా లబ్ధిదారులకు రూ.లక్ష సాయం అందించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారులు, ఆయా వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11,381 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగానే స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే యాదవులకు గొర్రెల పంపిణీ, మత్య్సకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ, నాయీబ్రాహ్మణులకు, రజకులకు వృత్తి నిర్వహణకు ఉచితంగా కరెంట్ సౌకర్యం, ఎస్సీలకు దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షల సాయం ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తూ నిరుపేద, మధ్యతరగతుల ఆర్థికాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పడు చేతివృతిదారులకు చేయూతనిచ్చేందుకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించారు.
అమలు పర్చే తీరు ఇలా..
తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు వందశాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం అందిస్తోంది. కార్యక్రమంలో ప్రధానంగా బీసీ వర్గాల్లోని సంచార జాతులు, కుల వృత్తులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న వారు స్వయం ఉపాధితో తమ జీవితాన్ని మెరుగుపర్చుకునేలా ఈ మొత్తాన్ని అందించనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విడతల వారీగా ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.
దరఖాస్తులపై సర్వే షురూ..
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందించనుంది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించగా జిల్లా వ్యాప్తంగా 11,381 దరఖాస్తులు వచ్చాయి. కాగా.. అర్జీలు పెట్టుకున్న వారు అదే వృత్తిలో కొనసాగుతున్నారా..? లేదా? అత్యంత నిరుపేదలా…? సొంతిల్లా…? అద్దె ఇంట్లో ఉంటున్నారా..? వంటి వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ప్రతి దరఖాస్తుదారుడు కులవృత్తి ఆర్థిక సాయం వస్తే ఏ యూనిట్ తీసుకుంటాడో సర్వే ఫాంపై నమోదు చేశారు. సర్వే ఫాంలను ఎంపీడీవో కార్యాలయంలో అందించారు. ఎంపీడీవో కార్యాలయం ద్వారా సర్వే సమాచారాన్ని ఆన్లైన్ చేశారు.
త్వరలో లబ్ధిదారుల గుర్తింపు..
అర్హులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలో లబ్ధిదారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఎంపికలో ప్రధానంగా అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారిని గుర్తించనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, సంచార జాతులు(యాచన వృత్తిదారులు)లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లబ్ధిదారులు తప్పకుండా దరఖాస్తులో సూచించిన చిరునామాలో నివాసం ఉండాలి. అభ్యర్థులు 2023, జూన్ 2నాటికి 18 నుంచి 55ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల ఆదాయం గ్రామీణ లబ్ధిదారులను ప్రాంతాల్లో అయితే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల వరకు ఉండాలి. గతంలో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారికి ఈ రుణాలు వర్తించవు. మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో ఎంపికైన జాబితాను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారికి అందిస్తారు. అకడ పరిశీలించిన అనంతరం దానిని కలెక్టర్ ఆమోదానికి పంపుతారు. మరో సారి కలెక్టర్ పరిశీలించి ఆమోదించాక లబ్ధిదారుల అర్హతలను బట్టి విడతలవారీగా ఆర్థిక సాయం అందిస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. ఎంపికైన వారి వివరాల జాబితాను మండలాలు, గ్రామాల్లో ప్రదర్శిస్తారు. ఎంపికైన వారికి ఒకేసారి రూ.లక్ష సాయాన్ని అందిస్తారు. ఆ మొత్తంతో వారు తమకు నచ్చిన స్వయం ఉపాధి యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. లబ్ధిదారులు స్థాపించిన యూనిట్లను సంబంధిత ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. లబ్ధిదారుడు యూనిట్తో కూడిన ఫొటోలను నెల రోజుల్లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
మండలాలవారీగా దరఖాస్తుల వివరాలు..
ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కో సం జిల్లా వ్యాప్తంగా 18మండలాల నుంచి 11,381 మంది దరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీ గా…. బయ్యారం మండలంలో 800మంది, చిన్నగూడురు-171, దంతాలపల్లి -413, డోర్నకల్ – 511, డోర్నకల్(అర్బన్) – 96, గంగారం-41, గార్ల- 463, గూడూరు-907, కేసముద్రం-1,168, కొత్తగూడ-205, కొత్తగూడెం-163, కురివి-963, మహబూబాబాద్-617, మహబూబాబాద్(అర్బన్)-1002, మ రిపెడ-644, మరిపెడ(అర్బన్)-61, నర్సింహులపే ట-504, నెల్లికుదురు-1088, పెద్దవంగర-510, తొ ర్రూరు- 823, తొర్రూరు(అర్బన్)-231 మొత్తం 11,381 మంది కుల వృత్తిదారులు దరఖాస్తులు చేసుకున్నారు.