భారీ వర్షాల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆశవర్కర్లతో కూడిన 400 టీమ్లతో సర్వే ఈనెల 7న ప్రారంభించగా 31 వరకు చేయనున్నారు. 800 మంది జ్వర పీడితులను గుర్తించారు. తీవ్ర జ్వరంతో ఆర్డీటీ కిట్తో పరీక్షలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 డెంగీ, 8 మలేరియా కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో రోజూ 180 నుంచి 200 వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో పారిశుధ్య చర్యలు, దోమల నివారణ చర్యలు చేపడుతున్నారు.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు ఉప్పొంగి వరదలు ప్రవహించాయి. ఈ నేపథ్యంలో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలనున్నందున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఆశ వర్కలతో కూడిన 400 టీంలు జ్వర సర్వే చేస్తున్నాయి. ఈ జూలై 7న ప్రారంభించగా 31వ తేదీ వరకు చేయనున్నారు. ఇప్పటివరకు మంది జ్వర పీడితులను గుర్తించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారికి ఆర్డీటీ (మలేరియా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్) కిట్లతో పరీక్షలు చేస్తున్నారు.
గ్రామంలో ఐదుగురికి పైగా జ్వర బాధితులు ఉంటే తక్షణమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో రోజూ 180 నుంచి 200 వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలతోపాటు జిల్లా పంచాయతీ శాఖ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్యంపై ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దోమల నివారణకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్డీటీ కిట్స్, డెంగీ, మలేరియా రోగులకు మందులను అందుబాటులో ఉంచారు. గ్రామాల్లో మురికి కాలువలు, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారు. కాచిన నీటినే తాగాలని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5 డెంగీ, 8 మలేరియా కేసులు ఉన్నాయని, వాటి నివారణకు తగినచర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మహదేవ్పూర్, పలిమెల, కాటారం, మహముత్తారం మండలాల పరిధిలోని 18 అటవీ గ్రామాల్లో సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. సీజనల్ వ్యాధులలో భాగంగా డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి.అన్ని వ్యాధులకు సరిపడ మందులు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయి.
– డాక్టర్ ధనసరి శ్రీరామ్, డీఎంహెచ్వో