కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి గురువారం వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.78 కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు. ఫాతిమానగర్ సర్కిల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం రూ.55 లక్షలు కేటాయించినట్లు చీఫ్ విప్ పేర్కొన్నారు.
హనుమకొండ, నవంబర్ 3 : కాజీపేట ఫాతిమానగర్లో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని అధికారులను ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ ఆదేశించారు. గురువారం ఫాతిమానగర్లో ఆర్వోబీ పనులను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ దాస్యం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో అనేక అభివృద్ధి పను లు చేపడుతున్నట్లు చెప్పారు. 40 ఏండ్లు గా పరిషారం కాని సమస్యలను పరిష్కరించారని తెలిపారు. ఫాతిమానగర్లో బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆర్వోబీ కోసం సీఎం కేసీఆర్ రూ.78కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఫాతిమా సరిల్ల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం కూడా రూ.55లక్షలు మంజూరైనట్లు చీఫ్విప్ వివరించారు. ఆయన వెంట రైల్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
నీరాజన మహోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
హనుమకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర ధన్వంతరీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15న ములుగురోడ్డులోని వెంకటేశ్వరగార్డెన్లో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించే శ్రీ వేంకటేశ్వర నిత్యోత్సవ నీరాజన మహోత్సవానికి సంబంధించిన పోస్టర్నను పోస్టర్లను చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆవిష్కరించారు. హనుమకొండ రాగన్నదర్వాజ పెద్దకోవెల(రంగనాయక)లో జరిగిన కార్యక్రమానికి చీఫ్ విప్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా అర్చకుడు కలకోట రాఘవాచార్యులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ధన్వంతరీ సేవాసమితి రాష్ట్ర నాయకులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, జీవీఎస్ శ్రీనివాసాచారి, బ్రాహ్మణ సేవాసమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, కల్పలత సూపర్బజార్ చైర్మన్ జనార్దన్, న్యాయవాది రంజిత్తో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహోత్సవ సమన్వయ కమిటీతో వినయ్భాస్కర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర నిత్యోత్సవ నిరాజన మహోత్సవాన్ని దాతల సహకారంతో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమన్నారు. వేలాది మంది పాల్గొనే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో కలిసి ఈ నెల 7న సమన్వయ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చాగంటి కోటేశ్వర్రావు వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు మండువ శేషగిరిరావు, ఏవీ సత్యమోహన్, ఆదిరాజు నర్సింహారావు పాల్గొన్నారు.
రిటైర్డు ఉద్యోగులకు అండగా ఉంటా
సుబేదారి : విశ్రాంత పోలీసు ఉద్యోగులకు అండగా ఉంటానని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన జిల్లా విశ్రాంత పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన భవనాన్ని వినయ్భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం కోసం పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. రిటైర్డు పోలీసు ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. తన వంతు బాధ్యతగా సంక్షేమ సంఘం కోసం నెల జీతం రూ.లక్ష అందజేస్తానని వినయ్భాస్కర్ తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్న తన సహకారం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి, పోలీసు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.