పంట మార్పిడిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలి
వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి
టీచర్లు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని సభ్యుల మండిపాటు
గ్రామాల్లో విద్యా వ్యవస్థపై ఫోకస్ పెట్టాలన్న ఎమ్మెల్యే పెద్ది
చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం
పాల్గొన్న కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు
వరంగల్, డిసెంబర్ 15(నమస్తేతెలంగాణ) : వరికి బదులు ఇతర పంటలను సాగు చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నందున క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన బుధవారం జడ్పీ సర్వ సభ్య సమావేశం జరుగగా, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, కలెక్టర్ గోపి హాజరయ్యారు. ప్రధానంగా వ్యవసాయం, రెవెన్యూ, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధిపై వాడివేడిగా చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల టీచర్లు కొందరు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు.
ఇతర పంటల సాగుకు ప్రో త్సాహం అందించాలని జడ్పీ సర్వ స భ్య సమావేశం నిర్ణయించింది. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన బు ధవారం జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. అదన పు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రా జారావు పాల్గొన్న ఈ సమావేశానికి జ డ్పీ వైస్చైర్మన్ శ్రీనివాస్, ఫ్లోర్లీడర్ పె ద్ది స్వప్న, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్ర భుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగులో రైతులకు సాగు పద్ధతులు, యాంత్రీకరణ, మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పించాలన్నా రు. కిసాన్ క్రెడిట్ కార్డులను అర్హులందరికీ అందజేయాలని, బ్యాంకుల ద్వారా రుణ వసతి కల్పించాలన్నారు. మత్స్య సహకార సంఘాన్ని కొత్త జిల్లాల ప్రకా రం విభజన చేయాలని, పెండింగ్లో ఉన్న సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. చెరువుల్లో వదిలిన చేప పి ల్లలు భారీ వర్షాల వల్ల బయటకు పో యాయని, మళ్లీ వదిలేందుకు అదనం గా చేప పిల్లలను కేటాయించాలని కోరా రు. మహిళా సమాఖ్య భవనాల నిర్మా ణం కోసం స్థలాలను సేకరించాలని, ఇప్పటికే చేపట్టిన భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. సంగెం జడ్పీటీసీ జీ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి అప్పు తీసుకున్న వారిలో 10శా తం మందివి బకాయిలు ఉండగా, మిగ తా 90శాతం మందికి తిరిగి అప్పు ఇ వ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అప్పు వసూళ్లలో పీఏసీఎస్ల పాలకవర్గం స హకారం తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థలకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించడం, ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేయడంపై సమావేశం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు, సహకరించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. మిగతా రూ.250 కోట్లు కూడా విడుదల చేయాలని తీర్మానించింది.
విధులకు టీచర్ల డుమ్మా..
గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు విధులకు డుమ్మా కొడుతున్నారని, వంతులవారీగా డ్యూ టీలు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. టీచర్లు విధులకు హాజరు కాకపోవడం వల్ల కొన్ని గ్రామాల్లోని పాఠశాలలు మూసి ఉంటున్నాయని, విద్యాశాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన వ్య క్తం చేశారు. నెక్కొండ ఎంపీపీ మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం ఈ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించగా టీచర్లు విధులకు హాజరు కా కుండానే రిజిస్టర్లో సంతకం చేస్తున్నారని, ఇద్దరు టీచర్లు ఉంటే ఒకరోజు ఒక రు, మరోరోజు ఇంకొకరు లెక్కన విధు లు నిర్వర్తిస్తున్నారని, ఈ వ్యవహారంపై వీడియో చిత్రీకరించి విద్యాశాఖ అధికారులకు అందజేసినా చర్యలు తీసుకోలేదన్నారు. చెన్నారావుపేట ఎంపీపీ విజేందర్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు స్థానికంగా ఉండడం లేదని, పాఠశాల ప్రారంభమ య్యే సమయం ఉదయం 9 గంటలైతే తాపీగా 11 గంటలకు విధులకు వస్తున్నారన్నారు. విధులకు హాజరు కాని టీచర్లు ముందుగానే లీవు లెటర్ రాసి స్కూల్లో పెడుతారని, ఎవరూ విజిట్ చేయకపోతే వచ్చిన రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారన్నారు. నల్లబెల్లి జడ్పీటీసీ పెద్ది స్వప్న మాట్లాడుతూ.. నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో ని పలు గ్రామాలు జిల్లా కేంద్రానికి దూ రంగా ఉన్నాయని, ఈ గ్రామాల్లోని పా ఠశాలల్లో పనిచేసే టీచర్లు డిప్యుటేషన్పై హైదరాబాద్కు వెళ్లి విద్యార్థులను గాలికి వదిలేశారన్నారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్న నర్సంపేట నియోజకవర్గం నుంచి డిప్యుటేషన్పై వెళ్లిన టీచర్ల స్థానంలో ఇతర టీచర్లు రాలేదని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ కుంటుపడుతోందని తెలిపారు. ఎంపీపీ వీడియో సహా ఫిర్యాదు చేసినా స్పందించకపోతే భవిష్యత్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు పాఠశాలలను విజిట్ చేస్తారా? అని ప్రశ్నించారు. వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి మాట్లాడుతూ.. నిర్వహణ సరిగా లేని ఇల్లందలోని ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదని, ఇక్కడ మధ్యాహ్న భోజనం అమల్లోనూ అవకతవకలు జరిగాయన్నారు.
ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం..
నల్లబెల్లి జడ్పీటీసీ పెద్ది స్వప్న మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లోపిస్తోందన్నారు. పారిశుధ్యం కొరవడిందని, మిషన్ భగీరథ నీరు కూ డా సరిగా అందడం లేదని తెలిపారు. కొద్దిరోజుల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించగా పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతుండడం తన దృష్టికి వచ్చిందని చె ప్పారు. ఈ గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వీడియో చిత్రీకరించి అధికారుల దృష్టికి తెచ్చినట్లు వివరించారు. నల్లబెల్లిలోని కేజీబీవీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని స్వప్న తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీని పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఫైర్ అ య్యారు. నర్సంపేట నియోజకవర్గంలో ని అనేక గ్రామాలు ఐటీడీఏ పరిధిలో ఉ న్నాయని, ఈ గ్రామాలపై ఐటీడీఏ అధికారులెవరూ ఫోకస్ పెట్టడం లేదన్నారు. ఐటీడీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మానిటరింగ్ చేయడం లేదని, గ్రామాలకూ అధికారు లు రావడం లేదని తెలిపారు. ఐటీడీఏ నుంచి ఇంజినీరింగ్ విభాగం అధికారు లే గాకుండా ఇతర విభాగాల అధికారు లు కూడా జడ్పీ సర్వ సభ్య సమావేశానికి రావాల్సి ఉందన్నారు. గ్రామాలపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టే లా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పె ద్ది కలెక్టర్ గోపిని కోరారు.