వడ్ల సేకరణ లక్ష్యం 1.75 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటికే 92,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు
18 పార్బాయిల్డ్, 12 రా రైస్ మిల్లులకు తరలింపు
ఈ నెలాఖరుకు కొనుగోలు పూర్తి: అదనపు కలెక్టర్
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. వడ్లపై కేంద్రం తప్పించుకున్నా తెలంగాణ ప్రభుత్వం ఊరూరూ కాంటాలు పెట్టి కొనడంతో రైస్మిల్లులకు ధాన్యం పోటెత్తింది. జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల వడ్ల సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటికే 92,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 50 శాతం పైగా ధాన్యాన్ని కొని ప్రథమ స్థానంలో ఉంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 18 పార్ బాయిల్డ్, 12 రా రైస్ మిల్లులకు తరలించింది. ఈ నెలాఖరుకు కొనుగోలు పూర్తి కానుంది.
దేవరుప్పుల, మే 20: జిల్లాలో ఏప్రిల్ 28న ప్రారంభమైన ధాన్యం సేకరణ ఊపందుకుంది. యా సంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో జనగామ జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో నిలి చింది. ఇప్పటికే 92 వేల మెట్రిక్ టన్నుల క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో దిగుమతి చేశారు. 18 పార్ బాయిల్డ్ రైసుమిల్లులు, మరో 12 రా రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి చేస్తున్నారు.
లక్ష్యానికనుగుణంగా ధాన్యం సేకరణ
జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా జిల్లా యంత్రాగం ముందుకుపోతోంది. ఇప్పటికే 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి రైస్ మి ల్లుకు తరలించారు. ఈ దిశలో జిల్లాలోని సివిల్ సప్లయ్ అధికారులు అనుక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులు, ట్రాన్స్పోర్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో నిల్వ కాకుండా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని 12 మండలాల్లో 200 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 111 ఐకేపీ మహిళా సంఘాలతో నిర్వహిస్తుంండగా, 89 పీఏసీఎస్ సొసైటీలు రైతుల నుంచి ధాన్యం సేకరి స్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు వ్యవసాయ శాఖ ఇచ్చిన టోకెన్తో వస్తుండగా సీరియల్ ప్రకా రం ఆయా యాజమాన్యాలు తూకం వేస్తున్నాయి. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా ఎండ తీవ్రత, హమాలీల కొరతతో కొంత ఆలస్యమవుతున్నా వేగంగా కొనుగోలు జరుగుతుంది.
ఈ నెలఖారుకు కొనుగోలు పూర్తి చేస్తాం ..
ఈ నెలాఖరుకు ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాగం ముందుకు పో తోంది. ధాన్యం సేకరణలో జిల్లా ముందు వరసలో ఉంది. రైతులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్ల సహ కారంతో ముందుకు పోతున్నాం. రైతులు తమ ధాన్యాన్ని తేమ, తాలు లేకుండా తెస్తే తూకానికి, దిగుమ తికి జాప్యం ఉండదు. ఇప్పటికే ఇటు కొనుగోలు కేంద్రాల్లో, అటు రైస్ మిల్లుల్లో కటింగ్ పెట్టొద్దని స్పష్ట మైన ఆదేవాలు జారీ చేశామని తెలిపారు. కాని కొందరు రైతులు తాలు, మట్టితో తమ ధాన్యాన్ని కొను గోలు కేంద్రాలకు తెస్తుండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈనిని అధిగమించాలంటే తేమ, తాలు లేకుండా రైతులు తమ ధాన్యాన్ని తేవడమే మార్గం. ఇందుకురైతులు సహకరించాలని కోరుతున్నం. -భాస్కర్రావు, అదనపు కలెక్టర్
ప్రభుత్వం కొనకుంటే పెట్టుబడి మునుగుదుం..
రాష్ట్ర ప్రభుత్వం కనుక యాసంగి వడ్లుకొనకపోతే రైతులు పెట్టుబడి మునుగుదురు. కేంద్రం ఆడిన దోబూచులాటకు రైతులు భయపడ్డరు. సీఎం కేసీఆర్ మాటతోని ప్రాణం లేచొచ్చింది. నాకు 176 క్వింటాళ్ల ఒడ్లు పండినయ్, ఊళ్లనే మహిళా సంఘాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రంలో ఒడ్లు పోస్తే వెంటనే తూకం వేసిండ్రు, రెండు రోజుల్లోనే బ్యాంకుల నా ఖాతాల పైసల్ పడ్డయ్. అదృష్ట వంతులమయినం, ప్రభుత్వం కొనకపోతే అడ్తీదారులకు అడ్డగోలు రేటుకు అమ్మవలసి వచ్చేది. పెట్టుబడి ఎల్లకపోవు. తెలంగాణ ప్రభుత్వంల వ్యవసాయానికి సౌలత్లు పెరిగినయ్. – నడిదె చంద్రారెడ్డి, రైతు, దేవరుప్పుల