నల్లబెల్లి, నవంబర్ 22 : ఎన్నో ఏళ్లుగా పీవోబీలో లాకై ఉన్న భూ సమస్యలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పరిష్కరించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కన్నారావుపేట గ్రామానికి చెందిన సర్వే నంబర్ 58లోని భూములు పీవోబీలో లాక్ కావడంతో రైతులు క్రయ విక్రయాలు చేయలేక పోవడం, బ్యాంకు రుణాలు పొందలేక పోవడం, రిజిస్ట్రేషన్ కూడా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల బాధిత రైతులు ఎమ్మెల్యే పెద్దిని కలిసి విషయం తెలిపారు.
ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. దీంతో రైతులు ఎమ్మెల్యేను మంగళవారం సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, సర్పంచ్లు తంగెళ్ల నిర్మల, నూనావత్ వెంకన్ననాయక్, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, హింగ్లి శివాజీ, గ్రామ అధ్యక్షుడు మామిడిశెట్టి రవి, ఇట్టె కృష్ణారెడ్డి, పులిగుజ్జుల బాలరాజు, తండ రాజు, కాసం మధు, కక్కెర్ల సాంబయ్య, పులి అన్వేశ్, కోడెం బుచ్చయ్య, సనుప భద్రయ్య, పోలాటి శ్రీనివాస్రెడ్డి, బొద్దిరెడ్డి ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.