రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ రెండో విడత విజయవంతం కోసం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమాయత్తమవుతు న్నారు. ఈనెల 18 నుంచి వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నర్సంపేటలో కలెక్టర్ గోపితో కలిసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల దాకా కంటి పరీక్షలు చేయనుండగా ఏ రోజు ఎక్కడ క్యాంపు ఉంటుందో ఆయా ప్రాంతాల వారికి ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆహ్వానపత్రికలు, ఫ్లెక్సీలతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
గిర్మాజీపేట, జనవరి 10: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18న ప్రారంభం కానున్న కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కంటివెలుగు రాష్ట్ర ప్రోగ్రాం అధికారి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ పుష్ప అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించి, డీఎంహెచ్వో కే వెంకటరమణ సమక్షంలో కంటివెలుగు ప్రోగ్రాంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కంటివెలుగుపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ గోపాల్రావు, డాక్టర్ చల్లా మధుసూదన్, డాక్టర్ ప్రకాశ్, డీపీవో అర్చన, డీడీఎం నితిన్రెడ్డి, అప్తాలమిక్ అధికారి ప్రసాద్, సీసీ రామలింగయ్య పాల్గొన్నారు.
రాయపర్తి/నల్లబెల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన కంటివెలుగుపై మండలస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై మాట్లాడుతూ గ్రామాల వారీగా నిర్వహించనున్న కంటివెలుగు వైద్య శిబిరాలకు అన్ని వర్గాల ప్రజలు హాజరై ఉచిత సేవలు పొందాలన్నారు. ఉచితంగా నేత్ర పరీక్షలు, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు అవసరం ఉన్న వారికి నేత్ర శస్త్ర చికిత్సలు చేయిస్తారన్నారు. సమావేశంలో జడ్పీటీసీ రంగు కుమార్, మండల ప్రత్యేకాధికారి నరేశ్కుమార్నాయుడు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, మండల వైద్యాధికారి భూక్యా వెంకటేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలకేంద్రంలోని రైతువేదికలో వైద్యాధికారి శశికుమార్ ఆధ్వర్యంలో కంటివెలుగుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునీతా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమం ప్రతి ఇంటా వెలుగు నింపుతుందన్నారు. సమావేశంలో తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, సర్పంచ్ నానబోయిన రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి/చెన్నారావుపేట/కాశీబుగ్గ/వరంగల్చౌరస్తా: రెండో విడుత కంటివెలుగును విజయవంతం చేయాలని పర్వతగిరి జడ్పీటీసీ బానోత్ సింగ్లాల్ కోరారు. పర్వతగిరిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. సర్పంచ్లు గ్రామస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం ప్రజలు కార్యక్రమాన్ని వినియోగించుకునేలా చూడాలన్నారు. సమీక్షలో ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, వైద్యాధికారి ఉదయ్, ఎంపీపీ కమల పంతులు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, ఎంపీవో పాక శ్రీనివాస్, నోడల్ అధికారి లింగారెడ్డి, ఏపీఎం కృష్ణమూర్తి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో కంటి వెలుగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూచన ప్రకాశ్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి బాలకృష్ణ, డాక్టర్ సుమన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి అర్బన్ హెల్త్ సబ్ సెంటర్లో కార్పొరేటర్లు జన్ను షీభారాణి, తూర్పాటి సులోచన కంటివెలుగుపై సమీక్షించారు. డివిజన్ పరిధిలోని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, ఎనుమాముల, సుందరయ్యనగర్, బాలాజీనగర్, ఎస్ఆర్నగర్ ప్రాంతాల వారు వినియోగించుకోవాలని కోరారు. వైద్యుడు మోహన్సింగ్ పాల్గొన్నారు. సీకేఎం హాస్పిటల్లో 24, 25, 26, 27, 28, 29 డివిజన్ల అంగన్వాడీ, ఆశ వర్కర్లతో కంటివెలుగు కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. 24వ డివిజన్ నాయకులు ఆకుతోట శిరీష్, 25వ డివిజన్ నాయకుడు బస్వరాజు శ్రీమాన్, వైద్యాధికారి డాక్టర్ మౌనిక, సూపర్వైజర్ మసూద్ పాల్గొన్నారు.