వర్ధన్నపేట, జనవరి 19 : పేదల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, వర్ధన్నపేట 7వ వార్డులోని కోనాపురంలో కంటివెలుగు శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ప్రైవేట్ దవాఖానల్లో కంటి పరీక్షలు చేయించుకోవడానికి పేదలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను సీఎం కేసీఆర్ గుర్తించే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
ప్రధానంగా వృద్ధులు, పేద కుటుంబాల మహిళలకు ఈ కంటి అద్దాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రజలందరికీ కంటి వెలుగు పథకాన్ని వివరిస్తూ వారు పరీక్షలు చేయించుకునేలా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, చెన్నారం సర్పంచ్ పునుగోటి భాస్కర్రావు, మాజీ జడ్పీటీసీ సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.