హనుమకొండ, నవంబర్ 29 : హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో గురువారం జరుగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎనుమాములలోని వ్యవసాయ మారెట్ యార్డ్లో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల ఈవీఎంల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించే పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు పేరొన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికార యం త్రాంగం అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈవీఎంలతోపాటు పోలింగ్ సామగ్రిని కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు. కాగా, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఈవీఎంలు ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ విధులకు వెళ్లే అధికారులు, సిబ్బంది వివరాలను జనరల్ అబ్జర్వర్ డాక్టర్ హెచ్ఎన్ గోపాలకృష్ణ, పోలీస్ అబ్జర్వర్ తోగో కర్గా, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ అధికారులు సిబ్బందితో మాట్లాడారు. ఈవీ ఎంల డెమోను పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, పోలింగ్ అధికారులు, అదనపు అధికారులు, ఇతర అధికారులకు కలెక్టర్ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈవీఎంలు, పోలిం గ్ సామగ్రిని కేంద్రాలకు తరలించే వాహనాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎనుమాములలోని డిస్ట్రిబ్యూష న్ కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించారు. కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి పోలీస్ అధికారులు సిబ్బందికి సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ పలు సూచనలు ఇచ్చారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో వెళ్తున్న సిబ్బంది వాహనాల ఎదుట జనరల్ అబ్జర్వర్ హెచ్ ఎన్ గోపాలకృష్ణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అదనపు కలెక్టర్ మహేందర్జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, రిటర్నింగ్ అధికారులు రమేశ్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఈవీఎంలు, పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటు కలిగిన ప్రతి ఒకరూ తమ ఓటు హకును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు తాగునీరు, తదితర సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యంగా యువత ఓటు హకును వినియోగించుకునే విధంగా స్వీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో 484 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్, మీడియా కంట్రోల్ రూమ్, వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.