మరిపెడ, ఆగస్టు 14 : సీఎం కేసీఆర్ సారథ్యంలో, టీఆర్ఎస్తోనే పల్లెల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని తానంచర్ల, తాళ్లఊకల్ తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తానంచర్లలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.70లక్షలతో రంగాపురం -అర్లగడ్డ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణపనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధి కలలుకన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. పల్లె ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా నిత్యం ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలో విపక్షాలకు కాలం చెల్లిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, రామడుగు అచ్చుత్రావు, జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ తేజావత్ శారద, డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదగిరిరెడ్డి, డాక్టర్ జీ రవి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కే మహేందర్రెడ్డి, డీ శ్వేతాముఖేశ్, ఆర్ వెంకటరెడ్డి, సీహెచ్ శ్రీనివాస్రెడ్డి, బీ శ్రీను, జీ రమేశ్నాయక్, టీ పూరి, జిల్లా మైనార్టీసెల్ నాయకులు ఏ పాషా పాల్గొన్నారు.
గిరిజనులకు అన్ని విధాలా గుర్తింపు
నర్సింహులపేట : ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. జగ్గుతండా జీపీ పరిధి కొత్త తండాలో ఎంపీటీసీ అజ్మీరా నాయకీ ఇంటి ఆవరణలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గరిజనుల సంస్కృతీ సంప్రదాయలు గొప్పవని, వాటిని మరువొద్దన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీఠ పేసిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు టేకుల యాదగిరిరెడ్డి, లింగనాయక్, ఎస్సై మంగీలాల్, గిరిజనులు ఉన్నారు.