గ్రామ పంచాయతీ కార్యాలయాల కోసం పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 323 జీపీలు ఉండగా 120 పంచాయతీలకు సొంత భవనాలు అవసరమని గుర్తించింది. వీటి నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు కేటాయించింది. ఆరు నెలల్లో వినియోగంలోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇంజినీరింగ్ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్రామాల్లో భవనాలు నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించి ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వేగంగా పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
– వరంగల్, డిసెంబర్ 20(నమస్తేతెలంగాణ)
వరంగల్, డిసెంబర్ 20(నమస్తేతెలంగాణ) : పల్లెల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. కొత్త పంచాయతీ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పాలనా సౌలభ్యం కోసం తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేసింది. కార్యదర్శులను, సిబ్బందిని సైతం నియమించింది. నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి నెలనెలా నిధులు కేటాయిస్తున్నది. పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా ఊరూరా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కల పెంపకానికి నర్సరీ ఏర్పాటు చేసింది.
డంపింగ్యార్డు నిర్మించింది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించడానికి గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ లేదా ట్రాలీ ఆటోను సమకూర్చింది. ఊరూరా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. కొన్ని గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటూ చేపట్టింది. గ్రామ పంచాయతీకో వైకుంఠధామం కూడా నిర్మించింది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు పనులు చేపట్టింది. వీటితో పాటు మరెన్నో అభివృద్ధి పనులతో పల్లెలు ప్రగతిపథంలో దూసుకుపోతున్నాయి. ప్రతి పంచాయతీకి ఆదాయంతో పాటు ఆస్తులు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో కార్యాలయం నిర్వహణ కోసం సొంత భవనం లేని పంచాయతీలకు భవనాల నిర్మాణం చేపట్టాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక్కో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణం కోసం రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాకు 120 గ్రామ పంచాయతీల కార్యాలయాల భవనాల నిర్మాణానికి రూ.24 కోట్లు కేటాయించింది.
పాలనాపరమైన, సాంకేతిక అనుమతుల వంటివి ప్రభుత్వం నుంచి పొంది సాధ్యమైనంత త్వరలో 120 భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి ఇంజినీరింగ్ విభాగం అధికారులు కసరత్తు చేపట్టారు. భవన నిర్మాణానికి ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో స్థలాన్ని గుర్తించి ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ పంచాయతీల సర్పంచ్లు కూడా చొరవ చూపుతుండడంతో కొద్ది నెలల వ్యవధిలో నిర్మాణం పూర్త య్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నా రు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 120 గ్రామ పంచాయతీలకు కార్యాలయం నిర్వహణ కోసం కొత్తగా భవనాల నిర్మాణం జరుగనుండడం విశేషం. మండలం వారీగా నెక్కొండలో 20, చెన్నారావుపేటలో 7, దుగ్గొండిలో 11, ఖానాపురంలో 10, నల్లబెల్లిలో 11, నర్సంపేటలో 10, రాయపర్తిలో 16, గీసుగొండలో 12, సంగెం లో 13, పర్వతగిరిలో 7, వర్ధన్నపేటలో 3 భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
120 గ్రామ పంచాయతీలు ఇవే..
గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ కో సం భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూ రు చేసిన పంచాయతీల్లో చెన్నారావుపేటలోని బోడమానిక్యతండా, చెరువుకొమ్ముతండా, గొల్లపల్లి, జీడిగడ్డతండా, పత్నినాయక్తండా, పుల్లయ్యబోడుతండా, శంకరంతండా, దుగ్గొండిలోని బందంపల్లి, చంద్రయపల్లి, దేశాయిపల్లి, గిర్నిబావి, గొల్లపల్లి, గుడ్డేలుగుపల్లి, గుడిమహేశ్వరం, మదిరమందపల్లి, మల్లంపల్లి, మందపల్లి, తొగర్రాయి, ఖానాపురంలోని బండమీదిమామిడితండా, బోటిమీదితండా, బుధరావుపేట, చిలకమ్మనగర్, దర్మరావుపేట, కీర్యతండా, కొత్తూరు, రాగంపేట, రంగాపూర్, వేపచెట్టుతండా, నల్లబెల్లిలోని అర్వపల్లి, అసరవెల్లి, గొల్లపల్లి, మామిడివీరయ్యపల్లి,
ముచ్చింపులతండా, నాగరాజుపల్లి, నారక్కపేట, రాంగాపు రం, రుద్రగూడెం, నర్సంపేటలోని బోజనాయక్తండా, చంద్రయపల్లి, దాసరిపల్లి, ఏనుగులతం డా, ఇప్పలతండా, ఇటుకాలపల్లి, ముత్యాలమ్మతండా, నాగుర్లపల్లి, పర్సనాయక్తండా, రామవరం, నెక్కొండలోని అమీరమంగ్యతండా, అలంకానిపేట, బొల్లికొండ, చంద్రుగొండ, చిన్నకోర్పో లు, దీక్షకుంట, గొట్లకొండ, హరిచంద్తండా, మడిపల్లి, మహబూబ్నాయక్తండా, ముడిగొండ, నాగారం, నక్కలగుట్టతండా, పెద్దకోర్పోలు, పిట్టకాలబోడుతండ, రామన్నకుంటతండా, రెడ్లవాడ, సాయిరెడ్డిపల్లి, సీతరాంపురం, వెంకటాపురం ఉ న్నాయి.
వీటితో పాటు రాయపర్తిలోని ఆరెగూడెం, బాలాజీతండా, బాలునాయక్తండా, బందన్పల్లి, దుబ్బతండా, ఎర్రకుంటతండా, జగన్నాథపల్లి, జైరాంతండ, జేతురాంతండా, జింకురాంతండా, మొరిపిరాల, పనిష్తండా, రాయపర్తి, సన్నూరు, వాంకుడోతుతండా, గీసుగొండలోని అనంతారం, బొడ్డుచింతలపల్లి, దస్రుతండా, ఎల్కతుర్తి, హరియతండా, కొమ్మాల, కోనాయిమాకుల, మనుగొండ, మరియపురం, ఊకల్, సూర్యతండా, విశ్వనాథపురం, సంగెంలోని ఆశాలపల్లి, ఎల్గూరురంగంపేట, ఎల్గూరుస్టేషన్, గవిచర్ల, గొల్లపల్లి, గుంటూరుపల్లి, కాట్రపల్లి, కుంటపల్లి, నల్లబెల్లి, నర్సనగర్, సోమ్లతండా, తీగరాజుపల్లి, వెంకటాపూర్హవేలి, పర్వతగిరిలోని బట్టుతండా, సీకేతండా, దూపతండా, ఏనుగల్, ఇస్లావత్తండా, మంగ్త్యాతండా, మూడెత్తులతండా, వర్ధన్నపేటలోని రామోజీకుమ్మరిగూడెంతండా, అంబేద్కర్నగర్, దివిటిపల్లి ఉన్నట్లు అధికారులు తెలిపారు.