కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలైన ఇన్కంటాక్స్, సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
ఇన్కంటాక్స్ పరిధి పెంపు, సీపీఎస్ సమస్యపై నిలదీయాలి
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలుపడంలో ఉద్యోగుల పాత్ర కీలకం
టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
హనుమకొండ, ఏఫ్రిల్3: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలైన ఇన్కంటాక్స్, సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. సోమ వారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో హనుమకొండ జిల్లా టీఎన్జీవో అధ్య క్షతన జరిగిన టీఎన్జీవోస్ యూనియన్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం, డైరీ ఆవిషరణ కార్యక్రమానికి చీఫ్ విప్, నగర మేయర్ గుండు సుధారాణి, టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధా న కార్యదర్శి రాయికంటి ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఉద్యో గులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటాలు, బతుకమ్మల తో ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం వరకు ర్యాలీగా వచ్చా రు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భా స్కర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. వారి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పీఆర్సీ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తనకు ఉద్యోగుల తో 30 సంవత్సరాలుగా అనుబంధం ఉందని, వారి సమస్యలు తెలుసని, వాటిని ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. కడిపికొండ ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్తో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ టీఎన్జీవో ఆధ్వర్యంలో మహిళా దినోత్స వం నిర్వహించడం అభినందనీయమన్నారు.
సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్ సానుకూలం
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్య క్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సెర్ప్ ఉద్యోగులకు పీఆర్సీ మంజూరుకు టీఎన్జీవో కృషి చేసిందని, ఔట్ సో ర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇప్పించినట్లు తెలిపారు. కడిపికొండ ప్లాట్లు ఉద్యోగులకు ఇప్పించేం దుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ మంజూరు, ఇన్కంటాక్స్ పరిధి పెంచేందుకు కేంద్రంతో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న పంచా యతీ కార్యదర్శిలకు రెగ్యులర్ చేసేందుకు కృషి చేయ నున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ముందు పీఆర్ సీని ప్రకటించి వెంటనే ఐఆర్ అమలు చేయాలని ప్రభు త్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో దేశానికే ఆద ర్శంగా నిలుస్తోందన్నారు. హనుమకొండ టీఎన్జీవో సంఘం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తుందన్న రాజేందర్ కార్యవర్గాన్ని అభి నందించారు. టీఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం స్టాండింగ్ కౌన్సిల్ సమా వేశం ఏర్పాటు చేసుకునే ఏకైక సంఘం టీఎన్జీవో సంఘమని అన్నారు.
కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజుయాదవ్, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, టీజీవో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఏ జగన్మోహ న్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్, టీఎన్జీవో హనుమకొండ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగో పాల్, కోశాధికారి పనికెల రాజేశ్, కేంద్ర సంఘ నాయ కులు శ్యాంసుందర్, కత్తి రమేశ్, రామూనాయక్, సా రంగపాణి, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్రావు, డైరెక్టర్ అంజద్ అలీ, అశోక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రాంకిషన్, కాజా అహ్మద్, బూరుగు రవి, జ్ఞానే శ్వర్, శ్రీనివాస్, జిల్లా అధికారులు ఎ. శ్రీనివాస్కుమా ర్, టీఎస్జీఎల్ఐ సంయుక్త సంచాలకులు జయచంద్ర, దాస్యనాయక్, జిల్లా నాయకులు సలీం, మోయిజ్, శ్రీనివాస్, రాజమౌళి, బింగి సురేశ్, రాంప్రసాద్, రాజ్య లక్ష్మి, మేరీ జయంతి, శ్రీలత, రజిత, యమున, పావ ని, సరస్వతి, రాజమణి, కల్పన, లింగయ్య వెంకటరా మిరెడ్డి, మోహన్ రావు, యాదగిరి, తిరుపతి, ఉదయ్ భాసర్, రాజేష్ కన్నా, లక్ష్మీప్రసాద్, ఉస్మాన్, ప్రవీణ్, భరత్, రాజీవ్, అనూప్, పవన్, సదయ్య, ప్రణయ్, పృథ్వీ, లావణ్య, ప్రవళిక పాల్గొన్నారు.