హనుమకొండ, డిసెంబర్ 2 : వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఆదివారం చేపట్టనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డ్లోని స్ట్రాంగ్ రూంల వద్ద ఓట్ల లెకింపు కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఓట్ల లెకింపునకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. వివరాలను రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని రెండు నియోజకవర్గాలైన పరకాల, వరంగల్ పశ్చిమకు సంబంధించిన ఓట్ల లెకింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కౌంటింగ్కు 14 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి టేబుల్ వద్ద ఓట్ల లెకింపునకు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని అన్నారు. పరకాల నియోజకవర్గానికి 17 రౌండ్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి 18 రౌండ్లు ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్తో పాటు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెకింపు ప్రారంభమవుతుందని వివరించారు.
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి శనివారం రిహార్సల్స్ జరిగాయని చెప్పారు. ఓట్ల లెకింపునకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా పత్రికలు, ఇతర ఎలక్ట్రానిక్ మీడియాకు అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. కాగా, కౌంటింగ్ సిబ్బందికి శనివారం మారెట్ యార్డ్లో శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలను కౌంటింగ్ సిబ్బంది పాటించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెకింపును జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెకింపు ప్రక్రియను వీడియో, వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మహేందర్జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, రమేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.