రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ముఖ్య కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, పరకాల, దామెర, సంగెం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, వరంగల్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని వారు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
కరీమాబాద్/గిర్మాజీపేట, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని శుక్రవారం నగరవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కరీమాబాద్లోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మల్ల అంబేద్కర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 41వ డివిజన్లో ఈదుల రమేశ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పోశాల పద్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 32వ డివిజన్లో కార్పొరేటర్ పల్లం పద్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. మామునూరులోని 4వ బెటాలియన్లో సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. మామునూరులోని పీటీసీలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. మండిబజార్ నిజాంపుర సెంటినరీ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చి వద్ద దళిత యూత్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత బస్వరాజు శ్రీమాన్ పాల్గొని చర్చి సభ్యుల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం 200 మందితో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో దళిత యువసేన కార్యవర్గ సభ్యులు జన్ను అబ్రహం, జన్ను శ్యామ్, జన్ను సమూయోన్, జన్ను అనిల్, జింక కమల్, జన్ను సన్ని, జంగేటి అద్భుత్, జన్ను కృపాకర్, జన్ను దీక్షిత్ పాల్గొన్నారు.
కార్యాలయాల్లో వేడుకలు
వరంగల్ చౌరస్తా: ఎంజీఎం దవాఖానలోని సూపరింటెండెంట్ చాంబర్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ఎంవోలు డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ దిలీప్ పాల్గొన్నారు. కాకతీయ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్రావు, ఆర్ఎంవోలు డాక్టర్ హాన, డాక్టర్ దీపక్రెడ్డి, డాక్టర్ కరిష్మా, నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల వేడుకల్లో పాల్గొన్నారు. ఎంజీఎం ప్రజారోగ్యం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అంబేద్కర్ జయంతిలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పు ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. 36వ డివిజన్ చింతల్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ అంబేద్కర్కు నివాళులర్పించి పండ్లు పంపిణీ చేశారు. 27వ డివిజన్ కూరగాయల మార్కెట్ రోడ్డులో కార్పొరేటర్ అనిల్, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
కోటలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
ఖిలావరంగల్: పడమరకోటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్ ఆవిష్కరించారు. విగ్రహం ఏర్పాటుకు రూ. లక్ష విరాళం అందజేశామని వారు చెప్పారు. అనంతరం కార్పొరేటర్ దంపతులు అన్నదానం చేశారు. విగ్రహ ఏర్పాటు కమిటీ సంఘం అధ్యక్షుడు నలిగంటి అనిల్, 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, తీగల జీవన్గౌడ్, బండి కోటేశ్వర్, మల్లేశం, రమేశ్, గౌతం, విజయ్పాల్, విజ్జి, జయపాల్, నర్సయ్య, రత్నమాల పాల్గొన్నారు.