పేదల సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా వరంగల్లోని దూపకుంటలో ఒకేచోట రూ.139 కోట్లతో 24 ఎకరాల్లో నిర్మిస్తున్న 2,000 ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 600 పూర్తి కాగా, మరో 400 ఇండ్లు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఈ వెయ్యి ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మిగతా 1,000 గృహాల నిర్మాణం కొద్ది నెలల్లో పూర్తి కానుంది. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలో రహదారుల నిర్మాణం, నీరు, విద్యుత్ సరఫరా తదితర మౌలిక వసతుల పనులు స్పీడందుకున్నాయి.
వరంగల్, సెప్టెంబర్ 19(నమస్తేతెలంగాణ): వరంగల్లో దూపకుంట వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే 600 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మరో నెల రోజుల్లో ఇంకో 400 ఇండ్ల నిర్మాణం పూర్తి కానుంది. సాధ్యమైనంత త్వరలో మిగతా 1,000 ఇండ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమల్లోకి తెచ్చింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో దూపకుంట వద్ద 2,000 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది.
ఒకేచోట రెండు వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్న సముదాయం ఉమ్మడి జిల్లాలో ఇదే కావడం దీని ప్రత్యేకత. ఇప్పటివరకు దూపకుంటలో మినహా మరెక్కడా కూడా ఒకే చోట రెండు వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మొదలు కాలేదు. దూపకుంట వద్ద సుమారు 24 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం రూ.139 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రహదారులు, భవనాల(ఆర్అండ్బీ) శాఖకు అప్ప గించింది. ఆర్అండ్బీ ఇంజినీర్లు రెండు వేల డబుల్ బెడ్రూం ఇండ్లను రెండు ప్యాకేజీలుగా రూపొందించి టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. వెయ్యేసి ఇండ్లలో ఒక్కో ప్యాకేజీ నిర్ణయించారు. రెండు ప్రముఖ కాంట్రాక్టు సంస్థలు వీటిని దక్కించుకున్నాయి.
అగ్రిమెంట్ కుదుర్చుకుని జీ ఫ్లస్ త్రీ పద్ధతిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను మొదలుపెట్టాయి. ఒక్కో బ్లాక్లో పదహారు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉండేలా నిర్మిస్తున్నాయి. 560 చదరపు అడుగులతో ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించేందుకు ప్రభు త్వం రూ.5.30 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ లెక్కన 2,000 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణానికి రూ.106 కోట్లు కేటాయించింది. ఒక కాంట్రాక్టు సంస్థ తమ ప్యాకేజీలోని వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లలో ఇప్పటికే 600 ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పెయింటింగ్ సైతం వేసి వీటిని లబ్ధిదారులకు కేటాయించడానికి ముస్తాబు చేసింది. మిగత 400 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
మరో కాంట్రాక్టు సంస్థ చేపట్టిన రెండో ప్యాకేజీలోని వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్లలో 400 ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరింది. ప్లాస్టింగ్, పెయింటింగ్ వంటి పనులు జరుగుతున్నాయి. ఇంకో నెల రోజుల్లో ఈ 400 ఇండ్ల నిర్మాణం పూర్తి కానుందని ఆర్అండ్బీ ఇంజినీర్లు చెప్పారు. మిగతా 600 ఇండ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఒక ప్యాకేజీలో 600 పూర్తి కావడం, మరో ప్యాకే జీలో ఇంకో నెల రోజుల్లో 400 పూర్తి కానున్నందున త్వరలోనే దూపకుంటలోని 2,000 డబుల్ బెడ్ రూం ఇండ్లలో 1,000 ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంటాయని వెల్లడించారు. మిగతా వెయ్యి ఇండ్లలో ఎక్కువ శాతం ఇండ్లు ఇప్పటికే స్లాబులు పడినందున మరో కొద్ది నెలల్లో వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రూ.33 కోట్లతో మౌలిక వసతులు
దూపకుంటలోని అతి పెద్ద డబుల్బెడ్ రూం ఇండ్ల సముదాయంలో రూ.33 కోట్లతో మౌలిక వసతు లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రహదారుల నిర్మాణం, నీరు, విద్యుత్ సరఫరా కోసం ఆర్అండ్బీ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి సర్కారుకు పంపారు. ఇప్పటికే ప్రభుత్వం మౌలి క వసతుల కోసం తొలి విడుత రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల బ్లాక్ల వద్ద ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నీటి సరఫరా పనులు చాలావరకు జరిగాయి. బ్లాక్ల మధ్యన సీసీ రోడ్లతో పాటు ప్రధాన రహదారిని తారు రోడ్డు గా నిర్మించే పనులు కొనసాగుతున్నాయి.
ఆయా బ్లాక్లోని ప్రతి డబుల్ బెడ్ రూం ఇంటికి నీరు, విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేంద ర్ దూపకుంటను సందర్శించి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, సాధ్యమైనంత త్వరలో పేదలకు అందించడానికి వీటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. దూపకుంట డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో మరింత స్పీడ్ పెరిగేందుకు తాజాగా కలెక్టర్ పి ప్రావీణ్య ఆర్అండ్బీ అధికారులతో చర్చించినట్లు తెలిసింది.