వరంగల్, ఫిబ్రవరి 27(నమస్తేతెలంగాణ) : బ్యాంకు లింకేజీ ద్వారా ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది. తిరిగి రెగ్యులర్గా చెల్లిస్తున్న ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీలేని రుణం పొందడానికి అవకాశం కల్పిస్తున్నది. ఒక్కో ఎస్హెచ్జీకి రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు అందజేస్తున్నది. ఈ రుణం పొంది న ఎస్హెచ్జీల్లోని సభ్యులు తీసుకున్న మొత్తంలో మూడు లేదా నాలుగు శాతం చొప్పున వాయిదా పద్ధతిలో నెలనెలా బ్యాంకులో వడ్డీ సహా రుణం చెల్లించా లి. అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో ఎస్హెచ్జీ సభ్యులకు లబ్ధి చేకూరుతున్నది. గత శుక్రవారం వరకు జిల్లాలో రెగ్యులర్గా రుణాలు చెల్లించిన ఎస్హెచ్జీల్లో 6,340 సంఘాలకు రూ.347.85 కోట్ల రుణ పంపిణీ జరిగింది. టార్గెట్పై ఇది 105.24 శాతం. దీంతో బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 104.75 శాతంతో జనగామ జిల్లా ద్వితీయ, 104.53 శాతంతో మెదక్ జిల్లా తృతీ య స్థానంలో ఉన్నాయి. జనగామలో రూ.284.32 కోట్లకు గాను 6,883 ఎస్హెచ్జీలకు రూ.297.82, మెదక్ జిల్లాలో రూ.386.89 కోట్లకు గాను 8,018 ఎస్హెచ్జీలకు రూ.404.41 కోట్ల పంపిణీ జరిగింది. మార్చి నెలాఖరు వరకు జిల్లాలో వడ్డీ లేని రుణాలను 125 శాతం పంపిణీ చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. పదకొండు నెలల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించి రుణాల అందజేతలో జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం సంపత్రావుతో పాటు ఇతర అధికారులకు కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ బీ గోపి అభినందనలు తెలిపారు.
బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాల పంపిణీ లో జిల్లాలో రెండు మండలాలు మినహా ఇతర మండలాలు నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించాయి. 124.80 శాతం రుణ పంపిణీతో నర్సంపేట ప్రథమ స్థానంలో ఉంది. ఈ మండలంలో 800 ఎస్హెచ్జీలకు రూ.32.19 కోట్ల రుణాలను పంపిణీ చేయాలనేది నిర్దేశిత లక్ష్యం. శుక్రవారం వరకు ఇక్కడ 621 ఎస్హెచ్జీలకు రూ.40.18 కోట్ల రుణ పంపిణీ జరిగింది. 116.16 శాతంతో గీసుగొండ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ 758 ఎస్హెచ్జీలకు రూ.28.17 కోట్ల రుణం పంపిణీ చేయాలనేది టార్గెట్. శుక్రవారం వరకు 500 ఎస్హెచ్జీలకు రూ.32.72కోట్ల పంపిణీ జరిగింది. 107.63శాతం రుణాల పంపిణీతో సంగెం మండలం మూడో స్థానంలో ఉంది. ఇక్కడ రూ.31.05 కోట్ల లక్ష్యానికి గాను రూ.33.42కోట్ల పంపిణీ జరిగింది. ఖానాపురంలో 106.29, నెక్కొండలో 104.46, రాయపర్తిలో 104.17, దుగ్గొండిలో 103.92, పర్వతగిరిలో 101.51, వర్దన్నపేటలో 101.43, నల్లబెల్లిలో 99.45, చెన్నారావుపేటలో 95.61శాతం వడ్డీ లేని రుణాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు. చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లోనూ వడ్డీలేని రుణాల పంపిణీ వేగవంతం చేసే దిశగా అధికారులు సాగుతున్నారు.
-ఎం సంపత్రావు, డీఆర్డీవో, వరంగల్ జిల్లా
ఎస్హెచ్జీలకు వడ్డీ లేని రుణాల పంపిణీలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం సంతోషం. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. బ్యాంకర్లు బాగా సహకరిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో వడ్డీ లేని రుణాల పంపిణీ లక్ష్యం రూ.328.15 కోట్లు. మార్చి నెలాఖరు వరకు 125 శాతం రుణాలను ఎస్హెచ్జీలకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం. ఎస్హెచ్జీల్లోని ప్రతి సభ్యురాలు నెలనెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల ఆదాయం పొందాలనేది టార్గెట్. ఆదాయాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాం.