నర్సంపేట, డిసెంబర్ 1 : విద్యార్థులకు సోలార్ ల్యాంపులతో ఎంతో ఉపయోగం ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం నర్సంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోలార్ ల్యాంపులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 700 విలువైన సోలార్ ల్యాంప్ను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ల్యాంపులను తాను సొంతంగా నిధులు వెచ్చించి విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీ నాయక్, వేములపల్లి సుబ్బారావు, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.