ఎల్కతుర్తి, ఏప్రిల్ 19 : చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని సూరారం గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న చేనేత భవనానికి భూమిపూజతో పాటు రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్తో కలిసి ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీశ్కుమార్ మాట్లాడుతూ గతంలో చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్ సైతం చేనేత కార్మికులకే ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకున్నారని పేర్కొన్నారు. సూరారంలో అప్పటి ఎంపీ కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేయించి పక్కా భవనానికి ఈ రోజు భూమిపూజ చేసుకోవడం శుభపరిణామమని చెప్పారు. చేనేత కార్మికులకు వాటా పరంగా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని పథకాలను రద్దు చేయడం బాధాకరమన్నారు. అంతేకాకుండా వరంగల్ సెంట్రల్ జైలు స్థలం ఆవరణలో సూపర్స్పెషాలిటీ దవాఖాన సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని, ఇందులో అన్ని రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వివరించారు. హనుమకొండ జిల్లాలో కలిసిన తర్వాత ఎల్కతుర్తి మండలం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
అనంతరం సూరారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రారంభించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.
మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను జడ్పీ చైర్మన్ ఎం సుధీర్కుమార్తో కలిసి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు ఎల్కతుర్తి మండలంలో 1524 మంది లబ్ధిదారులకు రూ.13 కోట్ల 76 లక్షల 43 వేలు అందించినట్లు వివరించారు.
మారెపల్లి సుధీర్కుమార్, జడ్పీ చైర్మన్ రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక కొన్ని ప్రతిపక్షాల మాటలను ప్రజలు నమ్మవద్దని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్కుమార్ సూచించారు. సూరారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
– బీఆర్ఎస్లో భారీగా చేరికలు
మండలంలోని సూరారం గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో గ్రామానికి చెందిన వేముల శివకుమార్, రమేశ్, అజయ్, అ శోక్, సతీశ్, రాజుకుమార్, రాంబాబు, ప్రవీణ్, రమే శ్, తరుణ్, శ్రీనివాస్, రాజుకుమార్, నగేశ్తో పాటు మరో వంద మంది ఉన్నారు. తామంతా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సతీశ్కుమార్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తమ గ్రామాభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఎంహెచ్వో సాంబశివరావు, ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సర్పంచ్ కుర్ర సాంబమూర్తి, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, సొసైటీ వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఎంపీడీవో తూర్పాటి సునీత, ఐకేపీ ఏపీఎం రవీందర్, వైద్యుడు సయ్యద్ ఎఖ్తేదార్ అహ్మద్, మాజీ ఎంపీపీలు శాలినీ, కోమ ల, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, నాయకులు మహేందర్, పిట్టల మహేందర్, సమ్మయ్య, మదన్మోహన్రావు, శివాజీ పాల్గొన్నారు.