సంగెం, సెప్టెంబర్ 17 : కల్యాణలక్ష్మి ఆడబిడ్డలకు వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 76 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ లబ్ధ్దిదారులకు చెక్కులను ఆదివారం హనుమకొండలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే మార్గదర్శిగా నిలిచారని చెప్పారు. మంచి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను మహిళలు తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, కందకట్ల నరహరి, సర్పంచ్లు బాబు, మంగ్యానాయక్, కక్కెర్ల కుమారస్వామి, వైస్ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీటీసీ రంగరాజు నర్సింహాస్వామి, నాయకులు గన్ను సంపత్,కర్జుగుత్త గోపాల్, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్, వీరభద్రయ్య, సొసైటీ చైర్మన్ కుమారస్వామి, వైస్ చైర్మన్ రాజు, మార్కెట్ డైరెక్టర్ సారంగపాణి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా..
ఆత్మకూరు, సెప్టెంబర్ 17 : నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని పెద్దాపురానికి చెందిన గ్రామ వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు ఎలగొండ అనిల్కుమార్, నడికూడ మండలంలోని రాయపర్తి, నార్లపూర్, నర్సక్కపల్లి, నడికూడ మండలానికి చెందిన యువ నాయకులు 30 మంది బీఆర్ఎస్ నాయకులు జిన్నా రామకృష్ణారెడ్డి, జన్నారపు రాయుడు ఆధ్వర్యంలో హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరకాల నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో మాట్ల సుధాకర్, శనిగరపు అభిలాష్, మనోజ్, మారపల్లి ప్రశాంత్, వినయ్, శివరాజ్, పవన్, కళాధర్, దేవేందర్, రమేశ్తో పాటు మరో 20 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.