పేదలకు అండగా సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
68 మందికి రూ.36 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నర్సంపేట, జనవరి 1 : తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, పేదల సంక్షేమానికి నిత్యం పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ.36 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. మెరుగైన వైద్యాన్ని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు, డయాలసిస్, రక్తనిధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీ మోతె కళావతి, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల సంక్షేమమే ధ్యేయం..
నర్సంపేట రూరల్ : కార్యకర్తల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని జీజీఆర్పల్లి గ్రామానికి చెందిన తుత్తూరు బస్వరాజం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అతడి భార్య లచ్చమ్మకు రూ.2లక్షల బీమా చెక్కును ఆదివారం క్యాంప్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందన్నారు. బీఆర్ఎస్ అంటే భరోసా, భద్రత అని అన్నారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ చెక్కుల పంపిణీ రాష్ట్రం అంతటా జరుగుతున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ తుత్తూరు కోమల, ఎంపీటీసీ బండారి శ్రీలత, క్లస్టర్ ఇన్చార్జి మోటూరి రవి, ఉపాధ్యక్షుడు అల్లి రవి, బండారి రమేశ్, మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.