కరీమాబాద్, డిసెంబర్ 24 : అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం మామునూరులో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రజలు వారి పండుగలు జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ శాంతికి సంకేతమన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
పోచమ్మమైదాన్(కాశీబుగ్గ) : రాష్ట్రంలో సర్వ మతాలకు సమ ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం పైడిపల్లిలోని బెత్లెహామ్ బాప్టిస్ట్ చర్చిలో 3,14వ డివిజన్ల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. క్రైస్తవులకు కానుకలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జన్ను షీభారాణి, తూర్పాటి సులోచన, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ ఎల్లావుల లలిత, హనుమకొండ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, బానోత్ కల్పన, బీఆర్ఎస్ 3వ డివిజన్ అధ్యక్షుడు నెరేళ్ల రాజు, పైడిపల్లి అధ్యక్షు డు పండుగ రవీందర్రెడ్డి, కొత్తపేట అధ్యక్షులు బొచ్చు రాజు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఇట్యాల శిరీషా, నాయకులు మంతుర్తి కుమార్ యాదవ్, జన్ను సారం గం, ముడుసు నరసింహ, గంధం గోవిందు, పత్రి సు భాశ్, పత్రి రాజపోషాలు, గండ్రాతి భాస్కర్, స్వరూప, జన్ను కరుణాకర్, జన్ను స్వామిదాస్, చిలుక ప్రభాక ర్, చర్చి అధ్యక్షులు దుంపేటి సుందరం పాల్గొన్నారు.