నర్సంపేట, ఫిబ్రవరి 17 : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని 480 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 5 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఒక్కో ఆడబిడ్డకు వివాహ సమయంలో రూ. 1,00,116 అందిస్తున్నారన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సహాయం అందుతున్నదని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం చేసిన ఎమ్మెల్యే..
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు అన్నదానం నిర్వహించారు. అంతకు ముందు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.