ములుగు, ఆగసు ్ట28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారని, నిబద్ధత, నిజాయితీ గల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సోమవారం హనుమకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆ పార్టీల నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. 2005 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంట నడిచారని, ఎన్నడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని, శ్రేణుల సూచన తీసుకున్నట్లు గుర్తుచేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రం, దేశంలో రాబోయే ఎన్నికల్లో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని, ములుగు నియోజకవర్గంలో సైతం ఎగిరేది గులాబీ జెండానేని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ కవిత హాజరయ్యారు. ముందుగా మాజీ జడ్పీచైర్మన్ దివంగత జగదీశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.1.50 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేర గా మంత్రులు వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలకు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని సభా ముఖంగా మంత్రులు పరిచయం చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రం లో 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందని, మతతత్వ బీజేపీ బోగస్ పార్టీ అని అన్నారు. ములుగును జిల్లా చేసి అభివృద్ధి చేసిం ది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. పోడు పట్టాలు ఇచ్చి, ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రె స్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరుగుతున్నదా అని ప్రశ్నించారు. ఆ పార్టీలకు విజన్లేదు, విషయం లేకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. ఎస్టీల్లో వర్గీకరణ పేరుతో విభజన చిచ్చుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. కంటికి రెప్పాలా కాపాడే సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలువాలని ప్రజలను కోరారు. జగదీశ్వర్ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే వలస పక్షుల్లా వచ్చే వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్లు చేసింది ఏమీ లేదు – మంత్రి సత్యవతిరాథోడ్
దేశ చరిత్రలో తొలి సారిగా 119 నియోజకవర్గాలకు 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్లు ఉన్నాయని, ప్రచార ఆర్భాటాలే తప్ప ఆ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో ములుగు గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ములుగు జిల్లాలో ప్రభుత్వం రూ.65 కోట్లతో కలెక్టరేట్, రూ.100 కోట్ల మెడికల్ కాలేజీని నిర్మిస్తున్నదన్నారు. దళిత, గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గతంలో పాలించిన కాంగ్రెస్ వారికి చేసిందేమీలేదన్నారు. రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. వనదేవతల పేర్లు పలికే అర్హత కాంగ్రెస్, బీజేపీలకు లేదన్నారు.
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతిని 30వేల మెజార్జీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కొంత మంది అభూత కల్పనలు చూపించి ప్రజల మొప్పు పొం దే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని చూసి కార్యకర్తలు, ప్రజలు అపోహపడవద్దన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పైసలు లేకున్నా గొప్ప ఆశయం ఉన్న అభ్యర్థి, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ఆదివాసీ ఆడబిడ్డ నాగజ్యోతి గెలుపునకు కృషి చేయాలన్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలను చవి చూసిన నాగజ్యోతి ప్రజలకు సేవలు అందిస్తుందనే నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు.
జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి నాగజ్యోతి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ములుగు గడ్డమీద గులాబీ జెండాను ఎగురవేసి జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని కార్యకర్తలను కొంగు చాచి అభ్యర్థించారు. జడ్పీ మాజీ చైర్మన్ మృతి తనను ఎంతో కలిచి వేసిందన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సమావేశంలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి, అంతటి విజయ, బుర్ర రజిత, జడ్పీటీసీ గై రుద్రమదేవి, జడ్పీకోప్షన్ మెంబర్ వలియాబీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాకులమర్రి లక్ష్మణ్రావు, సోమనాయక్, మల్క రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, రమణారెడ్డి పాల్గొన్నారు.
ములుగు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా..
పేదల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిదని, పార్టీ నిర్ణయం మేరకు అంద రూ కట్టుబడి గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ములుగు నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు. టికెట్ ఆశించిన వారు అధైర్యపడవద్దన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసం నాడు ఎన్టీఆర్ కృషి చేస్తే నేడు అంతకంటే మంచి పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అతి సునాయాసంగా గెలువబోయే మొట్టమొదటి అసెంబ్లీ స్థానం ములుగు నియోజకవర్గమేనని, 30వేల మెజార్టీతో బడే నాగజ్యోతి గెలువనున్నదని మంత్రి దయాకర్రావు జోష్యం చెప్పారు.