వరంగల్ : తెలంగాణ ఆడబిడ్డలకు దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ జిల్లాలో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు.
అలాగే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పర్వతగిరి మండలంలోని అనంతరం గ్రామంలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..18 ఏళ్లకు పైగా వయసు గల మహిళలందరికి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.